మెగా స్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇద్దరూ అజర్ బైజాన్ లో చక్కర్లు కొడ్తున్నారు. 'సైరా నరసింహా రెడ్డి' సినిమాకి సంబంధించి కొన్ని కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని అజర్ బైజాన్ లో ప్లాన్ చేయగా, రామ్ చరణ్ నటిస్తోన్న తాజా చిత్రం షూటింగ్ కూడా అజర్ బైజాన్ లోనే జరుగుతోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమవుతున్న సంగతి తెల్సిందే. ఇదిలా ఉంటే, చరణ్ గత కొన్ని రోజులుగా అజర్ బైజాన్ లోనే తన సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. చిరంజీవి మాత్రం, 'సైరా నరసింహా రెడ్డి' యూనిట్ అజర్ బైజాన్ వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత అక్కడికి చేరుకున్నారు.
'సైరా నరసింహా రెడ్డి'కి చరణ్ నిర్మాత కావడంతో, అటు హీరోగా తన సినిమా షూటింగ్ పనులు చూసుకుంటూ, 'సైరా' నిర్మాణ బాధ్యతలూ అజర్ బైజాన్లోనే చక్కబెట్టేస్తుండడం గమనించాల్సిన విషయం. చరణ్, చిరంజీవి మాtraమే కాదు 'సైరా నరసింహారెడ్డి' సినిమాకి కాస్ట్యూమ్స్ అందిస్తోన్న చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కూడా అజర్ బైజాన్ లోనే వుంది. చరణ్ సతీమణి ఉపాసన, అజర్ బైజాన్లోని సినిమా విశేషాల్నీ, ఫ్యామిలీ విశేషాల్నీ ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది.
|