మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త చిత్రం ఇటీవల లాంఛనంగా ప్రారంభమైంది. నవంబర్లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనున్న ఈ చిత్రానికి 'నేను శైలజ' ఫేం కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ ఏడాది 'రంగస్థలం'తో బ్లాక్ బస్టర్ అందుకున్న సక్సెస్ఫుల్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'హలో' బ్యూటీ కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి క్యాచీ టైటిల్ని ఫిక్స్ చేశారు. అప్పుడెప్పుడో దూరదర్శన్ ప్రేక్షకుల్ని వారం వారం అలరించే గీత మాలిక 'చిత్రలహరి' పేరును తేజు ఇప్పుడు తన సినిమాతో మళ్లీ గుర్తు చేస్తున్నాడు. ఈ చిత్రానికి 'చిత్రలహరి' అనే టైటిల్ని పెట్టి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు.
ఈ మధ్య తేజుకు అంతగా ఏదీ కలిసి రావడం లేదు. వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. అయితే ఈ సినిమాతో తేజు బౌన్స్ బ్యాక్ అవడం ఖాయమనిపిస్తోంది. 'నేను శైలజ' సినిమాతో సూపర్ హిట్ అందుకుని, 'ఉన్నది ఒక్కటే జిందగీ'తో ఓకే అనిపించుకున్న కిషోర్ తిరుమల తేజు బాడీ లాంగ్వేజ్కి తగ్గ స్క్రిప్టును తయారు చేశాడట. 'జవాన్', 'ఇంటెలిజెంట్' చిత్రాలతో వరుసగా మూస కథలను ఎంచుకుని, కథల ఎంపికలో కాస్త కన్ఫ్యూజ్ అయిన తేజు ఈ సినిమాని ఎంచుకోవడంలో కాస్త ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది. తాను ఇంతవరకూ నటించని సరికొత్త స్టోరీ అట ఇది. స్టోరీ పాతదే అయినా కథనం కొత్తగా చెప్పడంలో ఆల్రెడీ కిషోర్ తిరుమల తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు 'నేను శైలజ' సినిమాతో. చూడాలి మరి తేజుకు 'చిత్రలహరి'తో ఎలాంటి సక్సెస్ని ఇస్తాడో కిషోర్ తిరుమల.
|