మెగా పవర్స్టార్ రామ్చరణ్ తాజా చిత్రం 'వినయ విధేయ రామ'. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు, ఓవర్సీస్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దానికి కారణం 'రంగస్థలం' సినిమానే. ఓవర్సీస్లో అనూహ్యమైన వసూళ్లు రాబట్టింది 'రంగస్థలం'. ఇంతకు ముందెన్నడూ ఓవర్సీస్లో ఆ స్థాయి ఖాతాలు తెరుచుకోలేదు రామ్చరణ్కి. ఇక ఇప్పుడు క్లాస్, మాస్ టచ్ ఉన్న 'వినయ విధేయ రామ'తో ఎలాంటి సంచలనాలు సృష్టించబోతున్నాడో తెలీదు కానీ, మరోవైపు ఈ సినిమాపై నెగిటివ్ ప్రచారం మొదలైంది.
చరణ్ ప్రతీ సినిమాకి ముందు అనుమానాలు, ఆ తర్వాత సంచలనాలు మామూలే. మొదట్లో 'రంగస్థలం'పై వచ్చిన అనుమానాలు అన్నీ ఇన్నీ కావు. అలాగే ఇప్పుడు 'వినయ విధేయ రామ' పైన నెలకొన్న అనుమానాల్ని ఛేదించి సంచలన విజయం అందుకోవడానికి చరణ్ సమాయత్తమవుతున్నాడు. ఇంతవరకూ విడుదలైన పోస్టర్లు అంచనాల్ని పెంచుతూనే ఉన్నాయి. బోయపాటి గత చిత్రం 'జయ జానకి నాయకా' స్టార్డమ్తో సంబంధం లేకుండా ఓవర్సీస్లో మంచి వసూళ్లు రాబట్టింది. అలాంటిది ఆల్రెడీ 'రంగస్థలం'తో 120 కోట్లు కొల్లగొట్టిన రామ్చరణ్ ఈ సారి 150 కోట్లు మార్క్ని టచ్ చేస్తాడేమో చూడాలిక. 'భరత్ అనే నేను' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈ సినిమాని డివివి. దానయ్య నిర్మిస్తున్నారు. కైరా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది.
|