Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
ramcharan in vinayavidheya rama movie

ఈ సంచికలో >> సినిమా >>

మాజీ హీరోయిన్స్‌ గ్లామర్‌ పోలిటిక్స్‌.!

glamour politics

పొలిటికల్‌ తెరపై మాజీ హీరోయిన్స్‌ హల్‌చల్‌ చేస్తున్నారు. తెలంగాణా ఎలక్షన్స్‌లో భాగంగా ముఖ్యంగా ముగ్గురూ ముగ్గురే అన్నట్లుగా ప్రచారంలో విసృతంగా పాల్గొంటున్నారు ముగ్గురు మాజీ ముద్దుగుమ్మలు. వారిలో ఒకరు ఒకప్పటి లేడీ సూపర్‌స్టార్‌ కాగా, మిగిలిన ఇద్దరూ కూడా వెండితెరపై తమదైన గ్లామర్‌, పర్‌ఫామెన్స్‌తో సత్తా చాటిన వారే. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి దేశవ్యాప్తంగా ఈ ముగ్గురూ గుర్తింపు తెచ్చుకున్నారు. వారే విజయశాంతి, ఖుష్బూ మరియు నగ్మా - ఈ ముగ్గురు మాజీ హీరోయిన్లు గత కొంతకాలంగా తెలంగాణా ఎలక్షన్స్‌ ప్రచారంలో సందడి చేస్తున్నారు. వీరిలో విజయశాంతికి తెలుగు రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధం ఉంది. ఒకప్పుడు బీజేపీలో పని చేసిన విజయశాంతి, ఆ తర్వాత తల్లి తెలంగాణా పార్టీ పెట్టారు. కేసీఆర్‌ ఆహ్వానం మేరకు టీఆర్‌ఎస్‌లో చేరి మెదక్‌ ఎంపీగా పని చేశారు.

ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ తరపున స్టార్‌ క్యాంపెయినర్‌గా ఉన్నారు. నగ్మా, ఖుష్బూ విషయానికి వస్తే, ఈ ఇద్దరూ తమిళనాడు రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. వాగ్ధాటి విషయానికి వస్తే, ముగ్గురిలో ఖుష్బూదే పైచేయి. చాలా సూటిగా రాజకీయ ప్రత్యర్ధుల్ని ప్రశ్నిస్తున్నారామె. స్టార్‌ క్యాంపెయినర్‌గా విజయశాంతి పాత్ర ఈ ఎన్నికల్లో అత్యంత కీలకం. అలాగే నగ్మా కూడా పలు చోట్ల తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో పోలిటిక్స్‌లో సినీ గ్లామర్‌ తెలంగాణా రాజకీయాల్లో కనిపించలేదు.

మరిన్ని సినిమా కబుర్లు
Wedding ceremony