విలక్షణ పాత్రలూ, విభిన్న కథలను ఎంచుకోవడంలో మహేష్బాబు ముందుంటాడు. అయితే ఈ మధ్య మహేష్బాబు వరుసగా కోటీశ్వరుని పాత్రలే ఎంచుకుంటున్నాడు, మూస కథలకే ఓటేస్తున్నాడనే టాక్ బాగా వినిపిస్తోంది. దాంతో తదుపరి చిత్రం విషయంలో కాస్త ఆలోచనలో పడ్డాడట మహేష్బాబు. ప్రస్తుతం వంశీ పైడిపల్లితో 'మహర్షి' సినిమాలో నటిస్తున్న మహేష్బాబు, తదుపరి సుకుమార్తో సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్కి 'మహర్షి' ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా సుకుమార్ - మహేష్బాబు కాంబో విషయానికి వస్తే, గతంలో వీరిద్దరి కాంబోలో '1 - నేనొక్కడినే' సినిమా వచ్చింది. అయితే ఆ సినిమా ఆశించిన సక్సెస్ అందించలేదు. కానీ ఈ సారి పక్కాగా కమర్షియల్ హిట్ కొట్టాలనుకుంటున్నారట వీరిద్దరూ. దాంతో పాటు, విభిన్నమైన స్టోరీని ఫ్యాన్స్కి పరిచయం చేయాలనుకుంటున్నాడట మహేష్బాబు.
అందుకే ఓ సరికొత్త స్క్రిప్టును ప్రిపేర్ చేయమని సుకుమార్కి సూచించాడట. అందుకు తగ్గట్లుగానే సుకుమార్ ఓ థ్రిల్లర్ స్టోరీని మహేష్కి వినిపించాడట. ఆ స్టోరీ లైన్ బాగా నచ్చిందట మహేష్కి. మార్చిలో ఈ సినిమా సెట్స్ మీదికెళ్లనుందనీ సమాచారమ్. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఈ సినిమా రూపొందనుంది. ఏది ఏమైనా ఈ సారి మాత్రం సుకుమార్ లెక్క తప్పదంటున్నాడు. 'నాన్నకు ప్రేమతో', 'రంగస్థలం' సినిమాలతో బ్లాక్ బస్టర్స్ కొట్టి, జోష్ మీదున్న సుకుమార్ ఈ సినిమాతో హ్యాట్రిక్పై కన్నేసినట్లే.!
|