సంచలనాల దర్శకుడుగా పేరున్న రామ్గోపాల్ వర్మ ఏ సినిమా చేసినా, పబ్లిసిటీకి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఏదో ఒక రకంగా ఫ్రీ పబ్లిసిటీని గెయిన్ చేస్తుంటాడు వర్మ. ఇకపోతే ఆయన తాజా చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కి కూడా ఓ రేంజ్లో ఫ్రీ పబ్లిసిటీ దక్కుతోంది. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంటర్ అయిన నాటి నుండి తన సినిమా స్టోరీ మొదలవుతుందని మొదట్లోనే వర్మ ప్రకటించాడు. అందుకు తగ్గట్లుగానే స్క్రిప్టు ప్రిపేర్ చేశాడు. లేటెస్టుగా ఎన్టీఆర్ ఫస్ట్లుక్ని రిలీజ్ చేసి, అంచనాల్ని పదింతలు చేసేశాడు. ఇక త్వరలోనే మిగిలిన కీలక పాత్రల్ని కూడా పరిచయం చేయనున్నాడు.
ఇదిలా ఉంటే, 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కి టీడీపీ నేతల నుండి వచ్చే వ్యతిరేకతే ఫుల్ పబ్లిసిటీ ఇస్తుందని చెప్పాలి. ఆల్రెడీ ఓ టీడీపీ ఎమ్మెల్యే వర్మపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, కేఏ పాల్ వివాదం 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కి మరింత పబ్లిసిటీ తెచ్చిపెడుతోంది. కేఏ పాల్ తనపై చేసిన ఆరోపణలకు వర్మ రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. దానికి మళ్లీ పాల్ విరుచుకుపడడం, వర్మ మీడియా ముఖంగానూ, సోషల్ మీడియా పరంగానూ స్పందించడంతో, వర్మ వెర్సస్ కేఏపాల్ మధ్యలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్'.. ఇలా ఓ రేంజ్లో పబ్లిసిటీ రానే వచ్చేసింది. ఇక ఫిబ్రవరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో 'లక్ష్మీస్ ఎన్టీఆర్'కి సంబంధించిన మెయిన్ ట్రైలర్ని విడుదల చేస్తానని వర్మ ప్రకటించారు. కన్నడ నటి యజ్ఞాశెట్టి ఈ సినిమాలో లక్ష్మీపార్వతి పాత్ర పోషిస్తోంది.
|