'సైరా నరసింహారెడ్డి' తర్వాత చిరంజీవి రెండు సినిమాలకు కమిట్ అయ్యారు. అందులో ఒకటి కొరటాలతో సినిమా కాగా, మరోటి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా. ఇటీవల జరిగిన 'వినయ విధేయ రామ' సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనే త్రివిక్రమ్తో చిరంజీవి సినిమా కన్ఫామ్ చేశారు. దాంతో అంతకన్నా ముందే అనుకున్న కొరటాల శివ సినిమాని పక్కన పెట్టేశారనే వార్తలు వెలువడ్డాయి. అందుకు స్పందనగా లేటెస్టుగా క్లారిటీ దొరికేసింది. చిరంజీవితో సినిమాపై కొరటాల తాజాగా స్పందించారు. త్రివిక్రమ్ ప్రస్తుతం బన్నీతో సినిమాకి కసరత్తులు చేస్తున్నారు. ఆ సినిమా పూర్తి కావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. ఈలోగా సైరా పూర్తి చేసుకుని చిరంజీవి కొరటాల సినిమాని పట్టాలెక్కించేస్తారట. ఆల్రెడీ ఈ సినిమాకి స్క్రిప్టు కూడా రెడీ అయిపోయిందనీ తెలుస్తోంది. హీరోయిన్గా 'భరత్' బ్యూటీ కైరా అద్వానీని అనుకుంటున్నారట.
భరత్ అనే నేను సినిమాతో కైరాని టాలీవుడ్కి పరిచయం చేసింది కొరటాల శివే కావడం, ఆ సినిమా మంచి సక్సెస్ అవ్వడంతో, సెంటిమెంట్ పరంగా కొరటాల కైరాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీనియర్ భామ త్రిష పేరు కూడా పరిశీలనలో ఉంది. చూడాలి మరి కొరటాల సినిమాలో మెగాస్టార్తో చిందేయనున్న ఆ ముద్దుగుమ్మ ఎవరో. ఈ సినిమా కూడా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లోనే రూపొందనుంది.
|