సూపర్స్టార్ మహేష్బాబు తాజా చిత్రం 'మహర్షి'ని ఏప్రిల్ 25న విడుదల చేసేందుకు ఫైనల్గా కన్ఫామ్ చేశారు. ఏప్రిల్లో మహర్షి విడుదల కాలేదనీ, షూటింగ్ పార్ట్ ఇంకా పూర్తికాలేదనీ, రీషూట్స్ నిర్వహిస్తున్నారన్న రూమర్స్ అన్నీ కొట్టి పారేసి చిత్రయూనిట్ తాజాగా ఈ స్టేట్మెంట్ని విడుదల చేసింది. మార్చి 15 కల్లా చిత్రీకరణ పూర్తవుతుందట. రెండు పాటలు మినహా సినిమా టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోతుందట.
ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలెట్టేస్తారట. ఇప్పటికే షూటింగ్తో పాటు, డబ్బింగ్ పనులు కూడా శరవేగంగా జరిగిపోతున్నాయి. ఇప్పుడు ఫైనల్ డేట్ కన్ఫామ్ చేశాక, చిత్ర యూనిట్ మరింత అలర్ట్ అయ్యిందనీ ఇంకొంచెం ఫాస్ట్గా పనులు కంప్లీట్ చేస్తోందనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్రాజుతో కలిసి అశ్వనీదత్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పూజాహెగ్దే హీరోయిన్గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇదిలా ఉంటే, రిలీజ్ డేట్పై ఎన్ని గాసిప్స్ వచ్చినా ఆ డేట్ని వదులుకోవడానికి మాత్రం మహేష్ ఇష్టపడడం లేదట. ఎందుకంటే మహేష్బాబుకిది 25వ చిత్రం. సో ఆ డేట్ని అస్సలు మిస్ కాకూడదని గట్టి పట్టు మీదున్నాడట. దాంతో నిర్మాతలు అదే డేట్ని ఫిక్స్ చేశారు.
|