మూడు కొప్పులు కలిస్తే కష్టమంటారు. కానీ సినీ రంగంలో రెండు కొప్పులు కలిస్తేనే చాలా కష్టమండీ బాబూ. మీకేం తెలుస్తాయి చెప్పండి మా సినిమావోళ్ల కష్టాలు. ఈ తీరు ఇప్పటికది కాదు, గతంలో నుండీ వస్తూనే ఉంది. ఇద్దరు ముద్దుగుమ్మలున్న సినిమాల్ని ఎంజాయ్ చేసేందుకు ఆడియన్స్కి బాగుంటుంది కానీ, వారిద్దరినీ మ్యానేజ్ చేయడానికి షూటింగ్లో యూనిట్కి చుక్కలు కనిపిస్తాయి మరి. తాజా సినిమా 'ఎన్జీకే' తెలుసు కదూ. ఈ సినిమాలో రకుల్, సాయిపల్లవి ఇద్దరు భామలున్న సంగతి కూడా తెలిసే ఉంటుందిలెండి. ఈ ఇద్దరు ముద్దుగుమ్మల మధ్య ఏదో వైరం ఉందనీ, ఏదో అంటే ఇంకేదో కాదు.. ఆధిపత్య పోరు. ఈ కారణంగా వీర్దిదరి మధ్యా గొడవలు తీవ్రమయ్యాయనీ, షూటింగ్ సమయంలో చిత్ర యూనిట్కి వీరిద్దరూ చుక్కలు చూపించారనీ ప్రచారం జరిగింది.
ఈ ప్రచారం తీవ్రతరమయ్యేసరికి, మన తెలివైన పిల్ల రకుల్ స్పందించింది. ఇంతవరకూ సినీ పరిశ్రమలో తనకు ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవనీ, ఇకపైనా ఎటువంటి విబేధాలు ఉండవనుకుంటున్నాననీ, హీరోయిన్ రకుల్ తన తాజా ఇంటర్వూలో చెప్పింది. తనకూ సాయిపల్లవికీ మధ్య మాటల్లేని పరిస్థితి ఉందంటూ జరుగుతున్న ప్రచారం అంతా ఉత్తదే అని కొట్టి పారేసింది. అంతేకాదు, తాను వర్క్ మైండెడ్ గాళ్ననీ, వర్క్ విషయంలో చాలా ప్రొఫిషనల్గా ఉంటాననీ, ఇలాంటి చిన్న చిన్న గొడవల్ని అస్సలు పట్టించుకోను.. అయినా ఇక్కడికి గొడవలు పెట్టుకోవడానికి రాలేదు. వీలైనంత ఎక్కువ మందిని ఫ్రెండ్స్గా మలచుకునేందుకే చూస్తానని రకుల్ చెప్పింది. మరి సాయిపల్లవి రెస్పాన్స్ ఏంటో.!
|