వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కిన 'యాత్ర'కి రాజకీయంగా ఎలాంటి అడ్డకుంలు ఎదురవుతాయో అని భయపడ్డారు. దాంతో కొన్ని పరిమితులకు లోబడి ఆ సినిమా తెరకెక్కించారు. కానీ, రెండో యాత్ర కోసం మాత్రం దర్శకుడు జూలు విదల్చనున్నాడు. ఈ సారి చేయబోయే సినిమా చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని భావిస్తున్నాడట. బడ్జెట్కి పరిమితులేం లేవ్. వీలైనంత త్వరగా ప్రారంభించి వీలైనంత త్వరగా ముగించేసి, ఏడాది లోపే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది దర్శకుడి ఆలోచనట. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారమ్ ప్రకారం 50 కోట్ల నుండి, 100 కోట్ల లోపు బడ్జెట్ వరకూ ఈ సినిమా కోసం వినియోగించనున్నారట. ఓ చారిత్రక సినిమాగా 'యాత్ర 2' ను రూపొందించాలని డైరెక్టర్ మహి.వి.రాఘవ అనుకుంటున్నారట. అందుకే నటీనటుల పరంగానూ నెక్స్ట్ లెవల్ అనే స్థాయిలో ఆలోచన చేస్తున్నారట.
వైఎస్ జగన్ పాత్రలో సూర్య నటించడం దాదాపు ఖాయమైంది. వైఎస్ పాత్రలో మమ్ముట్టి కొనసాగుతారు. ఆ పాత్రలో ఆయన్ని తప్ప ఇంకొకర్ని ఊహించుకోలేం. ఇంకా పలు పాత్రల కోసం ప్రముఖ నటీనటుల్ని ఎంచుకునే దిశగా యాత్ర 2 టీమ్ కసరత్తులు చేస్తోందట. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
|