ఈ ఏడాది సంక్రాంతి కోడి పందెం చాలా పవర్ఫుల్గా సాగనుంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే రోజు బాక్సాఫీస్ పోరుకు తలపడుతున్నారు. 'అల వైకుంఠపురములో..'తో స్లైలిష్ స్టార్ అల్లు అర్జున్, 'సరిలేరు నీకెవ్వరూ..' సినిమాతో మహేష్బాబు ఈ ఏడాది సంక్రాంతికి ఒకే రోజు అనగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇదిలా ఉంటే, సంక్రాంతి రిలీజ్ కోసం బన్నీ ఇప్పటి నుండే ప్రమోషన్స్ భారీ ఎత్తున ప్లాన్ చేశాడు. ఆల్రెడీ రెండు పాటలు రిలీజ్ చేసి, అదరగొట్టేస్తున్నాడు. ఇక 'రాములో రాములా..' పాటతో సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు. ఈ పాటతో సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్కి చేరాయి. బన్నీ హడావిడి ఇలా ఉంటే, మహేష్ మాత్రం చాలా కామ్గా ఉన్నాడు. 'సరిలేరు..' నుండి మహేష్ ఫస్ట్లుక్ టీజర్, విజయ శాంతి, రష్మికా లుక్ పోస్టర్స్ తప్ప హైప్ పెంచే ఎలిమెంట్ ఏదీ రిలీజ్ కాలేదింతవరకూ. దాంతో ఫ్యాన్స్లో ఆందోళన నెలకొంది.
చిత్రయూనిట్పై ఫ్యాన్స్ నుండి తీవ్రమైన ఒత్తిడి కూడా పెరిగింది. ప్రస్తుతం కేరళలో షూటింగ్ జరుపుకుంటోన్న 'సరిలేరు..' ఆ షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చాక ప్రమోషన్స్పై దృష్టి పెట్టనుందని తెలుస్తోంది. కానీ, ఈలోగా బన్నీ దున్నేయాల్సింది మొత్తం దున్నేస్తున్నాడు. చూడాలి మరి, బన్నీతో పోటీ పడేలా మహేష్ బాబు ఎలాంటి పబ్లిసిటీ స్ట్రాటజీ ప్లాన్ చేశాడో.!
|