రామేశ్వరం. మన ఆలయాలు-6. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

రామేశ్వరం. మన ఆలయాలు-6.
రామేశ్వరం.(మన ఆలయాలు-6.)
చతుర్ధామలలో ఒకటిగా ఈఆలయాన్ని భావిస్తారు. ఈనాలుగుధామాలు దర్శిస్తే దేశం నలుమూలలా దర్శించినట్లే, మొదటిది రామేశ్వరం,రెండవది ద్వారక, మూడవది పూరిజగన్నాధ్,నాల్గవది బదరినాధ్. ఈశివక్షేత్రంలో మూడు ప్రాకారాలు ఉంటాయి.మొదటి ప్రాకారం గర్బలయంలోని శివలింగానికి ప్రతిదినం గంగాజల అభిషేకం జరుగుతుంది.ఆపక్కనే కాశీ విశ్వనాథ లింగం ఉంటుంది. ఈప్రాకారంలోనే కోటితీర్ధం,సరస్వతితీర్ధాలు ఉన్నాయి.రెండో ప్రాకారంలో అమ్మవారి ఆలయం ఉంటుంది. మూడవప్రాకారం ఒకమహల్ మాదిరిగా నిర్మాణంజరిగింది.ఈప్రాకరంలోని మంటపం 4000 అడుగులపొడవున 21అడుగులవెడల్పు 30ఎత్తులో సుందరంగా 1212 స్ధంబాలతో నిర్మించారు.ఈప్రాకారంలో రామలింగ విగ్రహాలు, కోదండరామస్వామి, నటరాజస్వామి మందిరము,సేతుమాధవ ఆలయం,కోనేరు ఇతరతీర్ధాలు ఉన్నాయి.ఆలయానికి చేరువలోని సముద్రంలో స్నానం చేసివచ్చి,ఈఆలయంలో 108 బావులు ఉన్నాయి. వాటిని'తీర్ధలు'అంటారు.వాటిలో22 తీర్ధలలో స్నానమాచరించి తడిబట్టలతో స్వామిని దర్శించుకుంటారు భక్తులు. రామేశ్వరం తమిళనాడు రాష్ట్రములోని రామనాథపురం జిల్లా లోని ఒక పట్టణం.ఈ పట్టణం రామనాథస్వామిదేవాలయం ఉంది. రాజధాని చెన్నైకి 572 కి.మి దూరములో ఉన్నఈ పట్టణం ప్రధానభూభాగంనుండి పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడింది. హిందు ఇతిహాసాల ప్రకారం ఇక్కడే శ్రీ రాముడు సేతువు నిర్మించి లంకాధీనేతైన రావణాసురుడు పరిపాలించిన లంకకు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామసేతువు అని పిలుస్తారు.రావణాసురిడిని నిహతుడిని చేశాక బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకునేందుకు రామనాథేశ్వర స్వామిని శ్రీరాముడే ప్రతిష్టించాడని స్ధలపురాణం ద్వారా తెలుస్తుంది.రావణుడు పులస్య బ్రహ్మమనుమడు,విశ్వవసుబ్రహ్మపుత్రుడు అయిందున ఆహత్యాపాతకం తొలగడానికి శ్రీరాముడు సప్తమహర్షుల సూచనమేరకు భారతదేశంలో 12శివలింగాలు ప్రతిష్టించాడు.వాటిలో ఒకటి ఇక్కడి'రామలింగేశ్వర లింగం'
రామేశ్వరము సముద్రమట్టానికి 10 మీటర్ల్ ఎత్తులో ఉన్న ఒక ద్పీపము. ప్రధాన భూభాగం నుండి ఈ ద్వీపాన్ని పంబన్ కాలువ వేరుచేస్తోంది ఈ శంఖు ఆకారంలో ఉన్నఈ ద్వీపం విస్తీర్ణం 61.8 చదరపు కి.మి. ఈ ద్వీపంభూభాగానిఎక్కువగా రామనాథస్వామిదేవాలయం ఆక్రమిస్తుంది.ఈ దేవాలయం ద్రవిడ శిల్పకళా చాతుర్యానికి ఒక మచ్చు తునక.ఇక్కడ నుండి శ్రీలంక దేశంకనిపిస్తూఉంటుంది. శ్రీలంక ప్రధానపట్టణం కొలంబొ 112 కి.మి దూరంలో ఉంది.
భారతీయులలో హిందువులు అనేకమంది కాశీయాత్ర రామేశ్వరం చూసిన తరువాతకాని పూర్తికాదని విశ్వసిస్తున్నారు. కాశీ గంగా తీర్థం తీసుకు వచ్చి రామేశ్వరం సముద్రంలో కలిపినట్లైతే కాశీయాత్ర పూర్తి ఔతుందని దేశంలోని సకల తీర్ధములు చూసిన ఫలం దక్కుతుందని హిందువులు విశ్వసిస్తున్నారు. ఇక్కడ ప్రధానదైవం రామనాథస్వామి. గర్భాలయాన్ని 10వ శతాబ్దంలో శ్రీలంక చక్రవర్తి పరాక్రమబాహు నిర్మించాడు. భారతీయ నిర్మాణకళా వైభవాన్ని చాటిచెప్పే కట్టడాలలో ఒకటి అయిన ఈ ఆలయ లోపలి నడవ (నడిచేదారి) దేశంలో అతిపెద్దదని సగర్వంగా చెప్పుకుంటున్నారు. 12వ శతాబ్దం నుండి ఈ ఆలయనిర్మాణం వివిధ రాజులు నిర్మించారు. ఆలయంలోని పెద్ద భాగమైన నడవ లేక గర్భగుడి తరువాత ఉన్న ప్రాకారం 1219 అడుగుల 3.6 మీటర్ల ఎత్తైన వైభవంగా అలంకరించబడి తగిన విధంగా స్థాపించబడిన స్తంభాలతో నిర్మించిన నిర్మాణం. ఈ నిర్మాణం అడ్డంకులు లేని 230 మీటర్ల పొడవు ఉంటుంది.
రామచంద్రుడు నిర్మించినట్లుగా చెప్పబడుతున్న వంతెన ఉన్న ప్రదేశాన్ని సేతుకరై (సేతు తీరం) అంటారు. రామాయణంలో వర్ణించబడిన ఈ సేతువును రామేశ్వరం సమీపంలో ఉన్న ధనుష్కోటి నుండి శ్రీలంకలో ఉన్న తలైమన్నార్ వరకు నిర్మించబడిందని పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి.
దక్షిణభారతదేశంలో ఉన్న దేవాలయాల వలే రామేశ్వరంలో ఉన్న రామనాథస్వామి దేవాలయ ప్రాకారం నాలుగు వైపుల పెద్ద ప్రహారి గోడలతో నిర్మితమై ఉంది. తూర్పు నుండి పశ్చిమ ప్రాకార గోడల మధ్య దూరం 865 అడుగులు, దక్షిణం నుండి ఉత్తర ప్రాకార గోడ ల మధ్య దూరం 657 అడుగులు. దేవాలయానికి నాలుగు దిక్కుల పెద్ద పెద్ద గాలి గోపురాలు ఉన్నాయి.
 
 
 
 
 
 
 
 
రామనాథస్వామి గుడికిఎదురుగా చేరువలోమైమరపించే సముద్రం
ఎన్నాళ్ళు చూసినా తనివి తీరదు. రామేశ్వరం ఒక అధ్యాత్మిక ప్రదేశమే కాదు అంతకంటే అద్భుతమైనది. తమిళనాడులో వున్న ఒక దీవి. రామేశ్వరంలో చూడాలి గాని చాలా ప్రదేసాలు ఉన్నాయి. రామనాథస్వామి గుడి, కొటి తీర్థాలు, రామపాదాలు, ధనుష్కోటి, విభీషణాలయం, ఇంకా చాలా చాలా ఉన్నాయి.
దీవి లోనికి వెళ్ళటానికి వీలుగా సముద్రం పై రైలు వంతెన (పాంబన్ రైలు వంతెన), రోడ్డు ఉన్నాయి. ఈ వంతెనలు సుమారు రెండున్నర కిలోమీటర్లు సముద్రం పై నిర్మించబడ్డాయి.రైలు వంతెన ఓడలు వచ్చినప్పుడు రెండుగ విడి పోతుంది.ఇక్కడ బీచ్లో కూర్చుని సుర్యోదయం, సుర్యాస్తమయం చూస్తు ఆ అనుభూతి అనుభవిస్తే మనసుకు ఏంతో ప్రశాంతత చేకూరుతుంది. చెన్నై నుండి రామేశ్వరానికి దినసరి రైళ్ళు గలవు.
రామేశ్వరం ఇది ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇచట శ్రీ కృత కృత్య రామనాథస్వామి వారు ఉన్నారు. కాల క్రమేణ ఈ గుడి ఉన్న ప్రాంతం గుడిమూల ఖండ్రిక గ్రామంలో కలుప బడింది.ఈ గ్రామంలో రంగనాథ, శ్రీ రామ, ఎల్లమ్మ, గంటలమ్మ, ఆలయాలు ఉన్నాయి.