బిల్వపత్రం ప్రాశస్త్యం - సి.హెచ్.ప్రతాప్

బిల్వపత్రం ప్రాశస్త్యం

శ్లో: త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధమ్ ।
త్రిజన్మ పాపసంహారమ్ ఏక బిల్వం శివార్పణమ్ ||

మారేడు లేదా బిల్వము హిందూ దేవతలలో ఒకరైన శ్రీ మహాశివుని ఆరాధనలో ఒక ముఖ్యమైన పూజాంశంగా భావిస్తారు. శివాపురాణం ప్రకారం శివుని బిల్వ పత్రములతో పూజించుట శ్రేష్టము. బిల్వ వృక్షము సాక్షాత్తు శివస్వరూపమని దేవతలు భావిస్తారు. బిల్వ పత్రం లేనిదే శివుని పూజ పూర్తి కాదని శాస్త్ర వాక్యం కూడా. తమ జాతక చక్రంలో శని దోషమున్న వారు, ఆ దోషమున్నవారు, ఆ దోషపరిహారార్ధము నన్ను బిల్వ పత్రములలో పూజిస్తే దోష నివృత్తి జరుగును. బిల్వ పత్ర పూజ చేత శివభక్తులైన వారిని ఈ శనీశ్వరుడు బాధించడు' అని స్వయంగా శివుడు శనీశ్వరునికి అభయమిచ్చెను. బిల్వపత్రం అంటే శివుడికి చాలా ఇష్టం. శివలింగంపై బిల్వపత్రాలను ఉంచి పూజ చేస్తే తప్పక శివానుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఏకంగా శివారాధన కోసం బిల్వాష్టకమే ఉంది. శివ పూజలో బిల్వ పత్రానికి అంత ప్రాశస్త్యం ఉంది. ఓ సారి బిల్వ వృక్షం కింద శివుడు తప్పస్సు చేస్తున్నప్పుడు పార్వతి శివ పూజకు అవసరమయ్యే పూజ సామగ్రిని తేవడం మరచిపోయింది. అక్కడే పడి ఉన్న బిల్వపత్రాలనే పుష్పాలుగా ఉపయోగించి పూజ చేయడం ప్రారంభించింది. వాటితో శివుడిని పూర్తిగా కప్పేసింది. ఆ పూజ ఆయనకు ఎంతో నచ్చి చాలా సంతోషించాడు. అప్పటి నుంచి శివారాధనకు బిల్వపత్రాలను ఉపయోగిస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి.మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి.
అతిసార వ్యాధికి దీని పండ్ల రసం చాలా మంచి మందు. ఆయుర్వేదములో వాడు దశమూలం లలో దీని వేరు ఒకటి. మొలలకు ఇది మంచి ఔషధము.దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది.
బిల్వ ఆకులు జ్వరాన్ని తగ్గిస్తాయి . . . బిల్వ ఆకుల కషాయము తీసి అవసరము మేరకు కొంచం తేనె చుక్కలు కలిపి తాగితే జ్వరము తగ్గుతుంది.
శివుడిని పూజించాలనుకున్నప్పుడు ఒకరోజు ముందు ఆకులను తీయడం మంచిది అని శాస్త్రం చెబుతోంది. ఎల్లప్పుడూ 3 ఆకుల సమితిని ఉపయోగించాలి.ఆకులను కత్తిరించకూడదు, ఎండబెట్టకూడదు లేదా వికృతీకరించకూడదు. సూర్యాస్తమయం తర్వాత ఎప్పుడూ ఆకులను తీయరాదు అట్లే ఆకులు తీయడానికి ముందు మరియు తరువాత ఎప్పుడూ చేతులను శుభ్రం చేసుకోవాలి. ఆకులు తీయడానికి చెట్టు నుండి కొమ్మను ఎప్పుడూ విరగగొట్టకూదదు. ఆకులను ఒక్కొక్కటిగా తీయమని శాస్త్రం చెబుతోంది.

ఆకులు తీయడానికి ముందు, శివునికి నైవేద్యాన్ని తాకట్టు పెట్టడానికి ఈ క్రింది మంత్రాన్ని పఠించాలి:

అమృతోద్భవ శ్రీ వృక్ష మహాదేవ ప్రియ: సదా. గృహ్యామి తవ పత్రాణి శివ పూజార్థ మాదరాత్॥

మరిన్ని వ్యాసాలు

Kashi Prayana Kathalu - tikkala raju
కాశీ ప్రయాణ కథలు - తిక్కలరాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Baruvu badhyatha
బరువు బాధ్యత!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - Sthithapragnudu
కాశీ ప్రయాణ కథలు - స్థితప్రజ్ఞుడు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Offer lo konna jeevitham
ఆఫర్‌లో కొన్న జీవితం !
- బొల్లిముంత వెంకట రమణారావు
Kashi Prayana Kathalu - vikatakavi telivi
కాశీ ప్రయాణ కథలు - వికటకవి తెలివి
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు