కనువిప్పు - బెల్లంకొండనాగేశ్వరరావు

kanuvippu

అమరావతి నగరంలో పేరమ్మ అనే వితంతువు తన కుమారుడు అప్పయ్య కోడలు ఈశ్వరితొ  కలసి నివసిస్తు ఉండేది. ఇరుగుపొరుగు వారి మాటలు విని ఈశ్వరి తన అత్తగారితో ఎప్పుడు తగవుపడుతూ ఉండేది. ఊరి వెలుపల ఆశ్రమం లోని సదానందస్వామిని దర్శించుకున్న ఈశ్వరి "స్వామి మా అత్తగారి పోరు భరింపలేకుండా ఉన్నాను ఎలాగైనా ఆమె త్వరగా   మరణించే మార్గం చెప్పండి" అని వేడుకుంది  .ఆమె అమాయకత్వానికి జాలిపడిన సదానందుడు" దాని కేముంది నేటి నుండి నువ్వు  మీ అత్తగారిని  కన్నతల్లి కన్నమిన్నగా అపురూపంగా ఆరు నెలల చూసుకోవాలి అంతే నేను ఇక్కడ పూజ చేస్తాను వెళ్ళిరా!"అన్నాడు. సదానందుని సలహ మేరకు తన అత్తగారిని ఎంతో ప్రేమగా చూసుకోసాగింది. కోడలిలో వచ్చిన మార్పు చూసిన పేరమ్మ ఈశ్వరి పట్ల ఆప్యాయంగా ఉండసాగింది. అత్త గారు తనను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూడటంతో మనసు మారిన ఈశ్వరి ఆరో నెల ప్రారంభం కావడంతో ఆందోళనతో సదానందుని ఆశ్రమానికి పరులాంటి నడకతో వెళ్ళి "స్వామి మన్నించండి ఇరుగు పొరుగు వారి మాటలు విని తల్లి వంటి అత్తగారిని అపార్దం చేసుకున్నాను అందుకే ఆమె మరణించాలి అని తప్పుడు కోరిక కోరుకున్నాను నా తప్పు తెలిసి వచ్చింది  నాకు కనువిప్పు అయింది మన్నించండి దయచేసి  నన్ను బిడ్డలా చూసుకునే నా అత్తగారికి ఎటువంటి ఆపద రాకూడదు నన్నుక్షమించండి"అని వేడుకుంది.

"తల్లి చెప్పుడు మాటలు ఎంతటి ముప్పు తెస్తాయో  అనుభవపూర్వకంగా తెలుసుకున్నావా? మీ యిద్దరి లోనూ అంతర్గతంగా దాగి ఉన్న ప్రేమా అనురాగాలు వెల్లడి కావడానికే నేను అలా చెప్పాను ,మీ అత్తగారికి ఎటువంటి  ప్రాణ భయం లేదు ఎక్కడ అయినా మంత్రాలకు చింతకాయలు రాల్తాయా? మంత్రాలన్ని మానవుల హితానికే ప్రేమానురాగాల విలువ అనుభవపూర్వకంగా తెలుసుకున్న నీవు అందరిచే గౌరవింపబడతావు వెళ్ళిరా తల్లి" అని ఆశీర్వదించాడు.

మరిన్ని వ్యాసాలు

Kaka o andamaina baakaa
కాకా... ఓ అందమైన బాక!
- ..... బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - garvam veedina raju
కాశీ ప్రయాణ కథలు - గర్వం వీడిన రాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అద్దంకి శ్రీరామమూర్తి.
అద్దంకి శ్రీరామమూర్తి.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు
Palatho kadigina boggu
పాలతో కడిగిన బొగ్గు!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kaashi Prayana Kathalu - navvina naapachenu
కాశీ ప్రయాణ కథలు - నవ్విన నాపచేను..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు