సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారంటూ ఈ మధ్య హాట్ హాట్గా న్యూస్ వచ్చాయి. ఆ దిశగా ఆయన కూడా కొంత ప్రయత్నం చేసినట్లే అనిపించింది. అయితే తాజాగా ఏమైందో ఏమో తెలీదు కానీ, రాజకీయాలపై దృష్టి పెట్టే ఆలోచన ఇప్పట్లో లేదంటూ రజనీకాంత్ ప్రకటించారు. అంతేకాదు, తన ఫోకస్ అంతా ఇప్పుడు కేవలం సినిమాల పైనే అని రజనీకాంత్ అన్నారు. ఓ రకంగా ఈ న్యూస్ అభిమానులకు కొంత స్వీట్ న్యూస్, కొంత బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రజనీకాంత్ సినిమాల్లోకి వస్తారంటూ ఎదురు చూసిన అభిమానులకు ఈ న్యూస్ సేడ్ న్యూసే.
అయితే ఆయన సినిమాలపై మాత్రమే ఫోకస్ పెడతానని చెప్పిన న్యూస్ అయితే స్వీట్ న్యూసే. అంతేకాదు వరుసగా సినిమాలు సైన్ చేసి, త్వరత్వరగా పూర్తి చేసి రిలీజ్ చేస్తానని కూడా ఆయన అన్నారు. దాంతో సినీ అభిమానులకు పండగే పండగ. ఆల్రెడీ రజనీ నటించిన రెండు సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. 'రోబో 2.0' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణానంతర పనుల్లో బిజీగా ఉంది.
ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. అమీజాక్సన్ హీరోయిన్గా నటించింది. ఇటీవలే ఈ సినిమా ఆడియో ఫంక్షన్ దుబాయ్లో కనీ వినీ ఎరుగని రీతిలో జరిగింది. మరో పక్క 'కాలా' చిత్రం కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. రజనీకాంత్ అల్లుడు ధనుష్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందింది. 'రోబో 2.0' విడుదలయ్యాక ఈ సినిమా విడుదల కానుంది. కాగా ఇవి కాక మరో రెండు సినిమాలు సెట్స్ మీదికెళ్లేందుకు రెడీగా ఉన్నాయట. మొత్తానికి రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ లేనట్లే అని తేలిపోయినట్టేనన్న మాట. సో ఇకపై రజనీ నుండి మరిన్ని మంచి సినిమాలను అభిమానులు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉందన్న మాట. అదీ సంగతి.
|