వాస్తవికతతో మెలగండి –ప్రమాదం వుంది - Goutham

Careful with Carona

కోవిడ్ -19 త్వరలో ముగుస్తుందని ఎవరైనా అనుకుంటే వాళ్ళది తప్పుడు అంచనా అవుతుంది. దీనికి మందు కనుక్కొనే లోపు అది మరింత తీవ్రంగా మారుతుంది. జంతువుల పెంపకం, వ్యవసాయం, పట్టణీకరణ తరువాత మహమ్మారులు మరియు అంటువ్యాధులు మానవ జీవితంలో భాగంగా మారాయి. మానవుడు జంతువులతో సహజీవనం చేయడం మరియు జంతువులూ మనిషి జీవితంలో భాగం కావడం ఇటువంటి అంటు వ్యాధులను వ్యాప్తి చెందడానికి అవకాశాలు ఎక్కువగా వున్నాయి. అహేతుక మరియు తప్పుడు సమాచారం వలన ప్రజలు తీసుకున్న చర్యల వలన అనేక జీవ జాతులు దెబ్బతింటున్నాయి. వైరస్ గబ్బిలాల ద్వారా వ్యాప్తి చెందే అవకాసం వుంది అని శాస్త్రవేత్తలు కనుగొన్నప్పుడు, మన దేశంలో ప్రజలు గబ్బిలాలను చంపడం ప్రారంభించారు. కానీ గబ్బిలాలు కేవలం మధ్యవర్తులు మాత్రమే. అంటే వైరస్ను మనుషులకు  వ్యాప్తి చేసేది కాదు. వైరస్ యొక్క మూలం జంతువులలో కాదు ప్రకృతిలో కనుగొనబడింది. వైరస్ ప్రకృతిలో ఎక్కడైనా పండ్లు, పువ్వులలో కూడా ఉండవచ్చు. మనము భయపడవలసిన అవసరం లేదు. వైరస్ మానవులకు వ్యాప్తి చెందడానికి ఏకైక మార్గం పక్షులు లేదా అడవి జంతువులు. కోవిద్ -19 మొదట గబ్బిలాలలో వచ్చిన అవి మనుషులకు వ్యాప్తి చేయలేవు. గబ్బిలలలో ఒక ప్రత్యేక జాతి ఉంది, ఇది అడవి జంతువులకు వ్యాప్తి చేయగలవు, మానవులకు కాదు. ఈ గబ్బిలాలు పాంగోలిన్లకు ఈ వ్యాధిని వ్యాప్తి చేసాయి. 'ప్రపంచంలో అత్యంత చట్టవిరుద్ధంగా చేసే పాంగోలిన్లు క్షీరద వర్తకం' మరియు చైనాలో జంతు అక్రమ రవాణా కారణంగా ఇది పాంగోలిన్ల నుండి మానవులకు సక్రమించింది. గబ్బిలాలు వైరస్ నుండి బయటపడవు మరియు జబ్బు పడవు. కోవిడ్ -19 వైరస్ మానవులలోలాగ గబ్బిలాల రోగనిరోధక శక్తిని అంతం చేయదు, ఎందుకంటే, రోగనిరోధక శక్తి చాలా బలంగా ఉన్న క్షీరదాలు గబ్బిలాలు మాత్రమే, అవి జబ్బు పడవు. బాట్ వుమన్ అని పిలవబడే షీజంగ్లి ప్రముఖ శాస్త్రవేత్త గబ్బిలాల మీద అనేక పరిశోధనలు చేశారు. సార్స్ పైన పరిశోధనలు చేస్తూ ఆమె హెచ్చరించారు “మనం కేవలం పై భాగం మాత్రమే చూస్తున్నాము, క్రింది భాగం చూడడం లేదు, ప్రమాదం గుర్తించడం లేదు ”అని.

కోవిడ్ -19 కి మరణాల రేటు చాలా తక్కువగా ఉందని భావిస్తూ, పెద్ద ప్రమాదం లేదని, ఒక వేళ వచ్చినా  కోలుకోగలమని అనుకోవడం తప్పుడు భావన మరియు అశాస్త్రీయమైనది. కోవిడ్ -19 మనము చూసినట్లుగా ఘోరమైనది కాకపోవచ్చు, భారతదేశంలో మరణాల రేటు తక్కువగా ఉందని అనుకుంటున్నాము. కానీ ఇది తప్పుడు నిర్ధారణ ఎందుకంటే ఇంతవరకు వ్యాధి సోకిన వారు మధ్య తరగతి మరియు ఎగువ మధ్యతరగతి వారు. వారికి  శరీరంలో మంచి పోషకాహారం ఉంది, పరిశుభ్రత ఉంది. ఈ వైరస్ పేదరికంలో నివసించే ప్రజలను ప్రభావితం చేస్తే, వారు జీవించగలరా? భారతదేశంలో 62% పేదరికంలో మరియు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నారు. R- నాట్, లేదా R0 అనేది వైరస్ యొక్క ప్రాథమిక పునరుత్పత్తి సంఖ్య - అంటువ్యాధుల యొక్క వ్యాప్తిని వివరించడానికి ఉపయోగించే ఒక ఎపిడెమియోలాజిక్ మెట్రిక్. ప్రారంభ దశలలో R0 సోకిన వ్యక్తి కనీసం 3-4 మంది వ్యక్తులను ప్రభావితం చేయవచ్చు. ప్రభావితమయిన వారికి లక్షణాలు లేకుండా కూడా వ్యాధి ఉండవచ్చు, వారిని గుర్తించలేము. వైరస్ పేద ప్రజలను తాకినట్లయితే, మరణాల రేటు అమెరికా కంటే ఘోరంగా ఉంటుంది,అక్కడ కోవిడ్ -19 మరణాలలో 65% పేదరికంలో నివసిస్తున్న ప్రజలు.

మనుషుల్లాగే వైరస్లు అభివృద్ధి చెందుతున్నాయి. బ్లాక్ డెత్ నుండి స్పానిష్ ఫ్లూ వరకు కోట్లాదిమంది మంది మరణిచారు. కొన్ని వైరస్లు ప్రాణాంతకం కావచ్చు,కొన్ని కాకపోవచ్చు. కానీ మనం తెలుసుకోవలసినది ఏమిటంటే, ఈ వైరస్ల యొక్క నిర్మాణాలు అర్థం కావు. అందుకే వెంటనే అవసరమైన సమయంలో నివారణను కనుగొనలేకపోతున్నారు. డిసెంబరు చివరలో చైనాలో కొత్త కరోనావైరస్ మొదటి కేసు నమోదు అయిన దగ్గర నుంచి  ప్రపంచం ఈ రకమైన వ్యాధుల గురించి చాలా నేర్చుకుంది. కోవిడ్ -19 వ్యాధి వలన లక్షలాది మంది చనిపోయారు అనేక లక్షల మందికి  సోకింది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న కేసులు మరియు మరణాలు కోవిడ్ -19  ప్రారంభ అంచనాలను తారుమారు చేసాయి. కరోనావైరస్ వ్యక్తి నుండి వ్యక్తికి సులభంగా వ్యాపిస్తుందని వైద్యులకు ఇప్పుడు తెలుసు, ఇది ఎటువంటి లక్షణాలను లేని వ్యక్తుల ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది మరియు పిల్లలు కూడా అనారోగ్యానికి గురవుతారు.

పరివర్తన చెందడం ప్రతి వైరస్ వైరస్ జీవిత చక్రంలో భాగం. ఆ మార్పులు ఎల్లప్పుడూ పెద్ద విషయం కాదు. కానీ  ఈ కొత్త కరోనావైరస్ ఆర్‌ఎన్‌ఏ వైరస్, అంటే ఇది ప్రోటీన్ షెల్ లోపల ప్యాక్ చేయబడిన జన్యు పదార్ధాల సమాహారం. ఆర్‌ఎన్‌ఏ వైరస్లు ఫ్లూ మరియు తట్టు వంటివి. క్రొత్త కరోనావైరస్ (SARS-COVID-2) పరివర్తన చెంది ప్రపంచవ్యాప్తంగా ప్రాణాంతకమైనదిగా, పెను ముప్పుగా మారుతుందని శాస్త్రవేత్తల అంచనా. కోవిడ్ -19 పరివర్తన ఇప్పుడు నెమ్మదిగా ఉంది. అంత రూపాంతరం చెందలేదు, ఒరిజినల్ వైరస్ కు దగ్గరగా వుంది. ఆర్‌ఎన్‌ఏ వైరస్ హోస్ట్‌తో సంబంధాన్ని ఏర్పరచుకున్న తర్వాత, ఇతర కణాలకు సోకేలా చేయగల కాపీలను తయారు చేయడం ప్రారంభిస్తుంది. ప్రారంభ దశలో వైరస్ పిరితిత్తులను మాత్రమే ప్రభావితం చేసింది. పరివర్తన చెందిన తరువాత గుండె, మూత్రపిండాలు మరియు ఇతర అవయవాలను కూడా ప్రభావితం చేస్తుంది. ఆర్‌ఎన్‌ఏ వైరస్లు బలహీనమైన వెర్షన్‌లోకి మారే అవకాశం కూడా ఉంది. కోవిడ్ -19 మ్యుటేషన్‌లో మరణాల రేటు తక్కువగా వున్నా తీవ్రమైన అంటువ్యాధిగా మారుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. COVID-19 యొక్క 14 రకాలను శాస్త్రవేత్తలు గుర్తించారు.

వ్యాక్సిన్ ఆలస్యంగా కనుగొనవచ్చు లేదా కనుగొనలేకపోవచ్చు అని శాస్త్రవేత్తలు మరియు వైరాలజిస్ట్ ఎందుకు చెప్పారు? ఎందుకంటే కోవిడ్ -19 మూలం ఇప్పటికీ ఒక రహస్యంగా వుంది. ప్రతి వైరస్కు మూలం ఉంది, మూలం తెలిస్తే వైరస్ ఎలా ప్రవేశించింది అనేది శాస్త్రవేత్తలు స్పైక్ ప్రోటీన్‌ ద్వారా కనుగొనవచ్చు. కరోనావైరస్ వివిధ రకాల హోస్ట్ గ్రాహకాలను గుర్తిoచింది.
ఇప్పటివరకు అంటువ్యాధులు మరియు మహమ్మారులు అన్నీ 2 సంవత్సరాలు పాటు వాటి ప్రభావం చూపించాయి. స్పానిష్ ఫ్లూ (1918-1920), బ్లాక్ డెత్ (1347-1350), స్వైన్ ఫ్లూ (2009- 2010), రష్యన్ ప్లేగు (1770-1772), ఫ్లూ పాండమిక్ (1888-1890) ) మరియు ఇటీవలి ఎబోలా (2014-2016). కోవిడ్ -19 కి ఇంకా ముగింపు తేదీ లేదు, ఈ రోజు మనం దానిని కట్టడి చేయగలిగినా అది విభిన్న తరంగాలలో ప్రజలను ప్రభావితం చేస్తుంది. స్పానిష్ ఫ్లూ 1920 ముగిసే ముందు 3 విభిన్న వేవ్ లలో ప్రభావితమైంది, మరణించిన వారి సంఖ్య మునుపటి వేవ్ కంటే ఎక్కువగా ఉంది. జూన్ 2009 లో హెచ్ 1 ఎన్ 1 ఇన్ఫ్లుఎంజా వైరస్ వల్ల ఏర్పడిన స్వైన్ ఫ్లూ కేసుల యొక్క మొదటి తరంగాన్ని యునైటెడ్ స్టేట్స్ అనుభవించింది, తరువాత సెప్టెంబరులో రెండవ వేవ్ వచ్చింది. SARS-CoV2 మునుపటి వైరస్ల మాదిరిగానే ఉంటుంది - అదే పద్ధతిలో ప్రవర్తించే అవకాశం ఉంది. రెండవ వేవ్ ఉంటే భారతదేశం సిద్ధంగా ఉందా?

దీన్ని ఎలా ఆపాలి? కరోనావైరస్ వలన మానవ జాతికి తీవ్రమైన ముప్పు. రసాయన శాస్త్రవేత్తలు మరియు ప్రయోగశాలల పరిశోధకులు ఇంకా మందు కనుగొనలేదు. కాబట్టి, వ్యాధి వ్యాప్తిని తగ్గించడానికి క్వారంటైన్, భౌతిక దూరం,మాస్కులు ఉపయోగించమని ప్రభుత్వం ఆదేశించింది. మందు లేదు కాబట్టి ఇదే మన ముందున్న ఉత్తమ పరిష్కారం. ఆర్థికంగా చూస్తే, ప్రతిదీ నిలిచిపోయినప్పటి నుండి అన్ని దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ వ్యాధి యొక్క ఆర్థిక చిక్కులు ప్రజారోగ్య వ్యవస్థకు మాత్రమే కాకుండా వాణిజ్యం, ఆహారం, ప్రయాణం, వ్యవసాయం మరియు పరిశ్రమలకు కూడా హానికరం. ఇలాగే కొనసాగితే ప్రజలు ఆకలితో చనిపోవచ్చు, ఇది వైరస్ కంటే ప్రమాదకరమైనది. కోవిద్ 19 ప్రపంచానికి కొత్త సవాలును విసిరింది. దీనికి అంతర్జాతీయ ఐక్యత ,సంఘీభావం అవసరం. అంతర్జాతీయ వ్యవస్థలు మరియు ప్రజలు కొత్త పరిష్కార మార్గాలను కనుగొన వలసి వుంటుంది. దేశాలు తమ విదేశాంగ విధానాలను మార్చడం మరియు కొత్త అంతర్జాతీయ క్రమాన్ని రూపొందించడం వంటివి కాదు. ఈ పరిస్థితిలో ముఖ్యమైనది ఐక్యత, సంభాషణ మరియు సంఘీభావం. ప్రపంచ శక్తి కోసం పరుగులు తీస్తున్న దేశాలు ఉన్నాయి. ఇవి యాంటీ-వైరస్ను కనుగొనటానికి ప్రయత్నిస్తాయి మరియు ‘సూపర్ పవర్’ గా ప్రవర్తిస్తాయి.
వైరస్‌కు జాతీయత లేదు, దానికి ఎజెండా లేదు, రాజకీయ అనుబంధం లేదు, వ్యాప్తి చెందడానికే ఉంది. అయితే ఎక్కడ ఎలా వస్తుంది అనేది తెలియదు.  వైరస్ను కట్టడి చేయగలిగే ఏకైక మార్గం ప్రజలు మరియు ప్రభుత్వము మధ్య సహకారం.

ఇది నింద లేదా విభజన కాదు. కానీ ఈ పరిస్థితిని అధికారం కోసం ఇంకా లాభాల కోసం ఉపయోగించుకోవాలనే శక్తులు ప్రపంచంలో పుష్కలంగా ఉన్నాయి. ఆ దేశాలలో వైరస్ దాని క్రూరత్వాన్ని చూపించింది. ఇది సమాజానికి ప్రమాదం. ఇప్పుడు కావలసినది ఒకరికి ఒకరి సహకారం, ఇతరులకు సహాయం చేయడం, మద్దతు, విలువలను విస్తరింపజేయడం మరియు శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని పంచుకోవడం.

"ఆశ పోయిందని మీరు అనుకుంటే పొరపాటే, మీలోపలికి చూడండి మీ కుటుంబంలోని ప్రతి వ్యక్తిని ఎంత జాగ్రత్తగా రక్షించుకుంటున్నారో, మీరు ఎంత బలంగా, ధైర్యంగా ఉన్నారో తెలుస్తుంది. చీకటిలోనే మనుషులకు ఆశ చిగురిస్తుంది. మనము సరైన పని చేయడానికి ఎంత బలంగా ఉన్నామో చూపిస్తే, వేకువ వుదయిస్తుంది.”