ఇండియన్ హెర్క్యులెస్ -కీ శే శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు గారు (1882 - 1942) - ambadipudi syamasundar rao

ఇండియన్ హెర్క్యులెస్ -కీ శే శ్రీ కోడి రామ్మూర్తి నాయుడు

మన పురాణాలలో బలానికి మారుపేరు శ్రీ ఆంజనేయాడు,మరియు భీముడు అలాగే గ్రీక్ పురాణాలలో బలానికి పేరుగాంచినవాడు హెర్క్యులస్ కాబట్టి పాశ్చాత్యులు అప్పట్లో ఇండియన్ హెర్క్యులెస్ గా బ్రిటన్ పాలకులైన కింగ్ జార్జ్, క్వీన్ మేరీ ల చే బకింగ్ హమ్  ప్యాలెస్  లో వారితో విందు తీసుకొని బిరుదు పొందిన మహానుభావుడు శ్రీ కోడి రామ్మూర్తి గారు ఇంకా కలియుగ భీమ, మల్ల మార్తాండ, జయవీర హనుమాన్, వీరకంఠీరవ వంటి బిరుదులను కూడా సొంతం చేసుకున్నరు. కోడి రామ్మూర్తి నాయుడు గారు ఈపేరు నేటి యువతకు అంతగాపరిచయము లేని  పేరు ఈయన ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు మల్ల యోధులు పురాణాలలో భీముడి గురించి విన్నాము గాని చూసే అదృష్టము లేదు కానీ కలియుగ భీముడిగా ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన తెలుగువారిలో అగ్రగణ్యులు.రామ్మూర్తి నాయుడు గారు. ఈయన  శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జన్మించారు.తెలుగు దేశంలో ప్రఖ్యాత తెలగ (కావు) వీర యోధ వంశాలలో కోడి వారి వంశం ఒకటి, ఈ వంశ పరంపరలోని శ్రీ కోడి వెంకన్న నాయుడు వీరి తండ్రి. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయి, తండ్రి ప్రేరణతోవిజయనగరంలో తన పినతండ్రి కోడి నారాయణస్వామి దగ్గర పెరిగారు.
అక్కడ ఒక వ్యాయామశాలలో చేరి దేహ ధారుడ్యాన్ని పెంచుకోవడంతో పాటు కుస్తీ కూడా నేర్చుకున్నారు. 21 సంవత్సరాల వయసులోనే ఇతడు ఛాతి పై 1 1/2 టన్నుల భారాన్ని మోసేవాడు. తరువాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగాడు. మద్రాసులో సైదాపేట కాలేజిలో ఒక సంవత్సరం వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని విజయనగరానికి తిరిగి వచ్చి విజయనగరం శిక్షణ తర్వాత వ్యాయామోపాధ్యాయుడుగా సర్టిఫికేట్ అందుకుని, విజయనగరంలో తాను చదివిన హైస్కూలులో వ్యాయామ శిక్షకుడుగా చేరాడువిజయనగరంలో పొట్టి పంతులు అనే మిత్రుని సహకారంతో సర్కస్ కంపెనీ నెలకొల్పాడు. తుని రాజాగారి నుండి సంపూర్ణ సహకారం లభించింది. రామమూర్తి సర్కస్ సంస్థ పలుచోట్ల ప్రదర్శన లిచ్చి మంచిపేరు తెచ్చుకున్నది.సర్కస్ కంపెనీ బాగా పెరిగింది.
తెలుగు జిల్లాల్లో ప్రదర్శనల తర్వాత 1912లో మద్రాసు చేరాడు. పులులు, ఏనుగులు, గుర్రాలు, చైనా, జపాన్ కళాకారుల సహకారం ఆయనకు లభించాయి. రామమూర్తి ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి. శరీరమునకు కట్టిన ఉక్కు గొలుసును, ఊపిరితిత్తులలో గాలిని పూరించుకుని ముక్కలుగా తుంచి వేశాడు. రెండు కార్లను రెండు భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకునేవాడు. కార్లను శరవేగంగా నడపమనేవాడు. కార్లు కదలకుండా పోయేవి. ఛాతీ పై పెద్ద ఏనుగును ఎక్కించుకునేవాడు. 5 నిమిషాల పాటు, రొమ్ముపై ఏనుగును అలాగే ఉంచుకునేవాడు. తండోపతండాలుగా ప్రజలు వారి ప్రదర్శనలు చూడాటానికి వచ్చేవారు
దేశ విదేశాలలో ఈయన ప్రతిభ మారుమోగటంతో పూనాలో లోకమాన్య తిలక్ గారి కోరిక మేరకు ప్రదర్శనలిచ్చాడు. తిలక్ రామమూర్తిగారికి మల్ల మార్తాండ, మల్లరాజ తిలక్ బిరుదములిచ్చారు.హైదరాబాద్ లో ఆంధ్రభాషా నిలయం పెద్దలు ఘనసత్కారం చేసి జగదేకవీర బిరుదమిచ్చారు విదేశాలలో భారత ప్రతిభను ప్రదర్శించమని తిలక్ ప్రోత్సహించారు .ఈయన ప్రతిభ విన్న అప్పటి వైస్ రాయ్ లార్డ్ మింటో రామ్మూర్తి గారి ప్రదర్శన చూడాలని వచ్చి అయన ఆంజనేయ స్వామి ఉపాసనలో ఉన్నందువల్ల కొంత సమయము వేచి ఉన్నాడు. లార్డ్ మింటో రామ్మూర్తి గారి ప్రదర్శనలను చూచి ముగ్దుడైనాడు తానూ నడుపుతున్న కారును ఆపవలసిందిగా కోరాడు అప్పుడు రామ్మూర్తి గారు తాళ్లతో కారును తన భుజాలకు కట్టుకొని కారును స్టార్ట్ చేయ,మంటే కారు అంగుళము కూడా కదలలేదు  ఈ సంఘటనతో వైస్రాయి ప్రశంసలను, దేశమంతటా గొప్ప పేరును సంపాదించాడు రామమూర్తి నాయుడు.
అఖిల భారత కాంగ్రెస్ సభ అలహాబాద్ లో జరిగేటప్పుడు  రామమూర్తి సర్కస్ అక్కడ ప్రదర్శనలిచ్చింది.ఇది చుసిన జాతీయ నాయకులెందరో చూచి ఆనందించి ప్రశంచించారు పండిత మదనమోహన మాలవ్యా ఎంతగానో మెచ్చుకొని విదేశాలలో ప్రదర్శనలివ్వమని ప్రోత్సహించారు పండిత మదన మోహన మాలవ్యాగారి అతిథిగా ఏడాదిపాటు బెనారస్ లో ఉన్నారు.రామమూర్తిగారు 1600 మంది గల తన బృందంతో లండన్ వెళ్ళి ప్రదర్శనలిచ్చారు. సుప్రసిద్ధ మల్లుడైన గామా పహిల్వాన్ తమ్ముడు ఇమామ్‌ బక్షీ ఆ బృందంలో వుండేవాడు. లండన్లో రాజదంపతులు జార్జిరాజు, రాణి మేరి, రామమూర్తిగారి ప్రదర్శనలను చూచి తన్మయులయ్యారు. రామమూర్తిగారిని తమ బక్కింగి హామ్‌ రాజభవనానికి ఆహ్వానించి, విందు ఇచ్చిన తర్వాత 'ఇండియన్ హెర్కులస్' బిరుదంతో సత్కరించారు. ఆ విధంగా బ్రిటిష్ రాజదంపతులచే, గౌరవింపబడిన భారతీయులలో మొదటి వాడు కోడి రామమూర్తి నాయుడు. రామమూర్తి గారు ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ దేశాలలో పలు ప్రదర్శనలిచ్చారు.
స్పెయిన్ దేశంలో 'కోడె పోరాటం' (బుల్ ఫైట్) చాలా ప్రసిద్ధమైంది. ఈ పోరాటం చాల భీకరంగా ఉంటుంది. రామమూర్తిగారిని ఆ పోరులో పాల్గొనమన్నారు. అట్టి పోరాటంలో ఏలాటి అనుభవంలేని రామమూర్తిగారు రంగంలో దుకి దూసుకుని వస్తున్న కోడె కొమ్ములను పట్టుకుని క్షణాల్లో క్రింద పడవేశారు. కోడెచిత్తుగా పడిపోయింది. వేలాది ప్రేక్షకుల హర్షధ్వానాలతో స్టేడియం మార్మోగింది.ఆ విధముగా స్పెయిన్ బుల్ ఫైట్ లో కూడా పేరు సంపాదించాడు ఆ తరువాత జపాన్, చైనా, బర్మాలలో రామమూర్తిగారి ప్రదర్శనలు ఎంతో వైభవంగా సాగాయి.
బర్మాలో వున్నపుడు రంగూన్లో ప్రదర్శనలిచ్చారు. అసూయగ్రస్తులు కొందరు రామమూర్తిగారిని చంపాలనుకున్నారు. ఎలాగో ఈ విషయం గ్రహించిన రామమూర్తిగారు ప్రదర్శనను ఆపి మరుసటి రోజే మాతృదేశం వచ్చారు. కోడి రామమూర్తిగారు కోట్లు గడించారు. అంత కంటే గొప్పగా దాన ధర్మాలకు, జాతీయోద్యమాలకు ఖర్చు చేశారు.
భారతదేశం అంతటా రామమూర్తిగారి పేరు ప్రతిధ్వనించింది. అమెరికా వెలి అక్కడ కూడా తన ప్రతిభను ప్రదర్శించాలి అనుకున్నారు . కాని వెళ్ళలేదు. ప్రతిరోజూ పత్రికల్లో రామమూర్తిగారి ప్రశంసలుండేవి. రామమూర్తి నాయుడుగారు ఆయన పూర్తిగా శాకాహారి. భారతదేశంలో అతి విశిష్టమైన వ్యాయామ విద్యాసంస్థను ప్రారంభించాలనుకున్నారు. కాని ఆ ప్రయత్నం ఫలించలేదు. రామమూర్తిగారు కాలిపై రాచపుండు లేచినందున కాలుతీసి వేయవలసి వచ్చింది. సేకరించిన ధనం కరిగిపోయింది. శస్త్ర చికిత్స జరిగినప్పుడు ఎటువంటి మత్తుమందును (క్లోరోఫామ్‌) తీసుకోకుండా ప్రాణాయామం చేసి నిబ్బరంగా శస్త్ర చికిత్స చేయించుకున్నారు
చివరిరోజులు బలంఘర్, పాట్నాలో కలవాండి (ఒరిస్సా) పరగణా ప్రభువు పోషణలో వుండి 16.1.1942 తేదీన కన్ను మూశారు నాయుడుగారు. తెలుగువారే కాక భారతీయులందరూ గర్వించదగిన మహనీయుడు, దేశభక్తుడు, 'కలియుగ భీమ' కోడి రామమూర్తి నాయుడుగారు.వరవిక్రయం, మధుసేవ వంటి గొప్ప సాంఘిక నాటకాలను రచయిత ,విఖ్యాత నాటక కర్త కాళ్ళకూరి నారాయణరావుగారు, కోడి రామమూర్తిగారి ఆప్త మిత్రులు. నాయుడుగారిని ప్రశంసిస్తూ " సాధు పథవర్తి సన్మిత్ర చక్రవర్తి రమ్యతరకీర్తి శ్రీ కోడి రామమూర్తి " అన్నారు. మన పురాణాలలో బల శబ్దానికి భీముడు, ఆంజనేయుడు పర్యాయ పదాలైనట్లు ఆంధ్ర ప్రదేశంలో ఇతడి పేరు బలానికి  దేహ దారుడ్యానికి  పర్యాయపదంగా పరిగణించబడింది కానీ దురదృష్టము ఏమిటి అంటే అంట గొప్పవాడికి ప్రసుతము సరిఅయిన గుర్తింపు లేదు అయన ఎరా సరి అయినా స్మారక చిహ్నాలు లేవు అయన తీరని కోరిక అయిన విశిష్టమైన వ్యాయమ విద్య సంస్థను ప్రారంభించి యివతకు మంచి శారీరక పటిష్టతను పెంపెందించే దిశగా ప్రభుత్వాలు పని చేయాలి అదే ఆయనకు సరి అయిన నివాళి.