ప్రసాదం - పరమార్ధం . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

ప్రసాదం - పరమార్ధం .

 

 

ప్రసాదం-పరమార్ధం.

అన్నం పరబ్రహ్మస్వరూపం అని శృతులు చెపుతున్నాయి.ప్రాణంకాపాడేది అన్నంకనుక,అన్నాన్నిప్రసాదంగాచూడమని ఆదిత్యపురాణంచెపుతుంది.

"పూజితం హ్వశనం నిత్యం బలమూర్జంచ యచ్ఛతి"

పవిత్రజలంతో పరిశుభ్రంగా పవిత్రభావంతో వండిన అన్నం పరబ్రహ్మ స్వరూపంఅవుతుంది. పదిమందికి పంచగా మిగిలిన శేషాన్ని 'అన్నయజ్ఞం'తరువాత భుజింపమని విజ్ఞులు చెపుతారు.దానాల్లోకెల్లా 'అన్నదానం'గొప్పదని పెద్దలు చెపుతారు.

'అన్నాన సదృశం దానం నభూతో నభవిష్యతి'

శుధ్ధము,సిద్ధము,ప్రసిధ్ధము అని ప్రసాదాన్ని లాక్షణికులు మూడు విధాలుగా పేర్కొన్నారు.గురుభుక్తశేషాన్ని'శుధ్ధము' దైవభుక్తశేషాన్ని'సిద్ధము' భగవత్ భక్తులు భుజింపగా మిగిలిన శేషాన్ని'ప్రశిధ్ధమని'పెద్దలు అన్నారు.అందుకే' అన్నబ్రహ్మతత్వరాధనకు'భారతీయసంస్కృతి పెద్దపీటవేస్తాయి.

అన్నంబ్రహ్మ"అహంచబ్రహ్మ"భోక్తాంచబ్రహ్మ"అన్నారు పెద్దలు.ప్రసాదమంటే ప్రసన్నత,తేటదనము,నైర్మల్యము, ఈప్రసాదం పంచకుండా తింటే విషతుల్యం అంటారు.

'అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే'

జ్ఞానవైరాగ్య సిధ్యార్థం బిక్షాందేహిచపార్వతీ'

అన్నం నైవేద్యరూపంలో ఒక విశిష్ఠత పరమార్ధంగా గోచరిస్తుంది.అన్నంనిండి నిబిడీకృతమైన శక్తి పాలతో కలసినపుడు, దీనికి తీపిపదార్ధంకలిపితే,ద్విగుణీకృతమౌతుంది.రెట్టింపై 'చక్కెరపొంగలిగా' మారుతుంది.దానికి పెసరపప్పు,కొబ్బరిముక్కలు కలిస్తే వచ్చే పోషకవిలువలు అపారం.అలా నివేదన చేయబడిన 'పిడికెడు'నైవేద్యం ఒ అభాగ్యుని అర్ధఆకలిని తీర్చగలుగుతుంది.అలాగే 'పులిహార''పొంగలి' 'దద్దోజనం'వంటి ప్రసాదాలలో అన్నంకంటే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కనుకనే వాటిని భగతార్పణం చేసి భుక్తశేషాన్ని మాత్రమే అమృతంగా భావించి స్వీకరించాలి.అందుకే 'ఏకభుక్తం మహాయోగి, ద్విభుక్తం మహాభోగి,త్రిభుక్తంమహారోగి అన్నారు.

ఆకలితొఉన్నవారికి రుచితెలియదుఅని'క్షుథాతురాణంనరుచిఃనచకాలమ్ .ఆకలిగా ఉన్నప్పుడు దొరికిన ఆహారం అమృతతుల్యం.మనిషిమరణించవచ్చుగాని,దానశీలిమరణానంతరము చిరంజీవే.అన్నిదానవలన మనిషి మహనీయుడిగా గుర్తింపబడతాడు.ఈ ఈశ్వరార్పణ భావనకి సత్త్యశుధ్ధికలుగుతుంది.అప్పుడే చిత్తశుధ్ధి,జ్ఞానం,జాలి,దయా,కరుణభావాలు ఏర్పడతాయి.ఈలక్షణాలు కలిగిన మనిషి ఇలలో మహాన్నతుడిగా కొనియాడబడతాడు. ఈదైవ నైవేద్యాన్నికొన్నీప్రాంతాలలో ప్రసాదం, ప్రసాద్, ప్రసాద అని అంటారు. ఇది శాఖాహారం పదార్ధం. ఇది హిందూ మతం, సిక్కు మతం రెండింటిలోనూ మతపరమైన సమర్పణ విధానాలలో ఒకటిగా భావించబడుతుంది. దీనిని సాధారణంగా దేవతారాధకులకు, భక్తులకు పంచిపెట్టబడుతుంది. సిక్కు మతంలోని లాంగరు మాదిరిగానే హిందూ మతంలో మహాప్రసాదం (భండారా అని కూడా పిలుస్తారు). ఆలయంలోని దేవతకు నివేదిన చేసే ఆహారం. దేవతకు నివేదింక ముందు సధారణమైన ఆహారం నివేదించిన తరువాత దేవతయొక్క అనుగ్రహదృష్టి ప్రసారం కారణంగా పవిత్రమైన ఆహారంగా భావించబడుతుంది. తరువాత దీనిని వివక్ష లేకుండా ప్రజలందరికీ పంచిపెడతారు. కొన్నిసార్లు ఈ శాఖాహార సమర్పణ వెల్లుల్లి, ఉల్లిపాయ, మూలాలు మొదలైన మానసిక ఉద్రేకం కలిగించే నిషేధిత మసాలా వస్తువులతో తయారుచేసిన ఆహారాలను దేవతలకు నివేదిచడంలో మినహాయించబడింది.

ప్రసాదం అనే మాట ముందే ఉన్న అదే క్రియ కూర్చోవడం, నివసించడం నుండి ఉద్భవించింది. ప్ర ఏకాక్షరం ఒక పదానికి ముందు చేర్చినట్లైతే ఆ పదం పవిత్రమైన నే అదనపు అర్ధం స్పురింపజేస్తూ పరిమిత క్రియగా ఉపయోగించబడుతుంది. ఉదాహరణగా క్రియ అంటే చర్య అనే ఒక అర్ధం వస్తుంది. క్రియ అనే పదానికి ముందుగా ప్ర అనే ఏకాక్షరం చేర్చినప్పుడు(ప్ర+క్రియ)అది ప్రక్రియ అనే పదంగా పవితరమైన చర్యగా అర్ధం స్పురింపజేస్తుంది. ఆహ్లాదకరంగా ఉంటుంది లేదా అనుకూలంగా ఉంటుంది. 'ప్రసాదం' అంటే దయగల బహుమతి. ఇది దేనినైనా సాధారణంగా తినదగిన ఆహారాన్ని సూచిస్తుంది. ఇది మొదట దేవత, సాధువు, పరమ గురువు అవతారానికి అర్పించబడుతుంది. తరువాత ఆయన లేదా ఆమె పేరు మీద వారి అనుచరులకు లేదా ఇతరులకు మంచి సంకేతంగా పంపిణీ చేయబడుతుంది.

వైవిధ్యమైన పేర్లు.

ఆధ్యాత్మిక స్థితిగా ప్రసాదానికి వేద సాహిత్యం నుండి సంస్కృత సంప్రదాయంలో అర్ధాల గొప్ప చరిత్ర ఉంది. ఈ వచన సంప్రదాయంలో ప్రసాదం అనేది దేవతలు, సన్యాసులు, ఇతర శక్తివంతమైన జీవులు అనుభవించిన మానసిక స్థితి, ఇది ఆకస్మిక ఔదార్యం, వరం ఇవ్వడంగా గుర్తించబడుతుంది. తొలి సాహిత్యంలో (ఋగ్వేదం) ప్రసాదం అనే పదం మానసిక స్థితిని సూచించడానికి ఉపయోగించబడింది. అంటేకాని ఆచార సాధనలో ఇది ఒక అంశం కాదు. శివ పురాణం వంటి తరువాతి గ్రంథాలలో ప్రసాదాన్ని ఒక భౌతిక పదార్ధంగా సూచించడం ఈ పాత అర్ధంతో పాటు కనిపించడం ప్రారంభిస్తుంది.

ప్రసాదం భౌతిక కోణంలో మానవ భక్తునికి, దైవిక శక్తికి మధ్య ఇవ్వడం, స్వీకరించడం అనే ప్రక్రియ ద్వారా ప్రసాదం అనే పదం సృష్టించబడుతుంది. ఉదాహరణకు ఒక భక్తుడు పువ్వులు, పండ్లు లేదా వండినవి, వండనివి అయిన ఆహారపదార్థాన్ని అర్పిస్తాడు - దీనిని నైవేద్యం అని పిలుస్తారు. అప్పుడు దేవత సమర్పణలో కొంత ఆనందిస్తుంది లేదా రుచి చూస్తుంది. దీనిని తాత్కాలికంగా భోగ్య అని పిలుస్తారు. ఇప్పుడు దైవంగా పెట్టుబడి పెట్టిన ఈ పదార్థాన్ని ప్రసాదం అని పిలుస్తారు. దీనిని భక్తుడు స్వీకరించడం, ధరించడం మొదలైనవి అందుకుంటారు. ఇది మొదట నివేదించిన పదార్థం లేదా ఇతరులు నివేదించే పదార్థం తరువాత ఇతర ఇది ప్రసాదంగా భక్తులకు తిరిగి పంపిణీ చేయబడుతుంది. అనేక దేవాలయాలలో, భక్తులకు అనేక రకాల ప్రసాదాలు (ఉదా., కాయలు, స్వీట్లు) పంపిణీ చేయబడతాయి.

ఆచరణలు.

 

కొంతమంది కఠినమైన గౌడియా వైష్ణవులు ప్రారంభించిన ఇస్కాను సంస్థకు చెందిన భక్తులు ప్రసాదం మాత్రమే తింటారు. అనగా వారు తినే ప్రతిదాన్ని మొదట కృష్ణుడికి అర్పిస్తారు. ఇతర హిందువులు కొన్ని మాత్రమే నివేదిస్తారు. అదనంగా ప్రసాదం వంట భగవంతుడికి నివేదించడానికి ముందు రుచి చూడకుండా చేయాలన్న నియమం ఉంటుంది. ఎందుకంటే ఇది విశ్వాసి సొంత వినియోగం కోసం కాదు. కృష్ణుడికి అర్పించడం - వారు కృష్ణుడి ఆహారం అవశేషాలను అందుకుంటారు. వారు కృష్ణుడికి భిన్నంగా భావిస్తారు. ఇస్కాను దేవాలయాలు వచ్చే వారందరికీ ఉచిత ప్రసాద భోజనం అందించడానికి ప్రసిద్ది చెందాయి. ఎందుకంటే ఇది పేదలకు ఆహారం ఇవ్వడమే కాదు, కృష్ణుడి దయను కూడా అందిస్తుందని వారు విశ్వసిస్తారు.

 

ప్రసాదం సాధారణంగా తయారుచేసే ఒక మార్గం, గౌరవించబడే ఆధ్యాత్మిక వ్యక్తి, చిత్రం లేదా దేవత శిలారూపం ముందు ఆహారాన్ని సమర్పించడం. కొన్నిసార్లు ఒక ప్లేటు మీద లేదా ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం మాత్రమే కేటాయించిన పాత్ర; కొంత సమయం గడిచిన తరువాత, ఆహారం ప్రసాదంగా మారి పంపిణీగా మారి పవిత్ర ప్రసాదం అవుతుంది.

 

మరిన్ని వ్యాసాలు

Kashi Prayana Kathalu - tikkala raju
కాశీ ప్రయాణ కథలు - తిక్కలరాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Baruvu badhyatha
బరువు బాధ్యత!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - Sthithapragnudu
కాశీ ప్రయాణ కథలు - స్థితప్రజ్ఞుడు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Offer lo konna jeevitham
ఆఫర్‌లో కొన్న జీవితం !
- బొల్లిముంత వెంకట రమణారావు
Kashi Prayana Kathalu - vikatakavi telivi
కాశీ ప్రయాణ కథలు - వికటకవి తెలివి
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు