నవ్వులరేడు రేలంగి. మనకళారత్నం. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

నవ్వులరేడు రేలంగి. మనకళారత్నం.

చెన్నయ్ తెలుగు నాటకరంగ చరిత్ర ప్రారంభం గురించి చెప్పడం కష్టం. చాళిక్యుల పాలనకు ముందు నుంచే తెలుగునాట నాటక ప్రదర్మనలు ఏదో ఒక రూపంలో ఉన్నట్లు అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. 'అంకమాలిక' అనే గేయనాటికలు ప్రచారంలో ఉన్నట్లు తెలుస్తుంది. 1860 లో శ్రీ కోరాడ రామచంద్రశాస్త్రి గారి 'మంజరి మధుకరీయం' తో తెలుగు నాటకరంగం ప్రారంభం ఐనదని పరిశోధకులు నిర్ఢారించారు. ఎందరో నటతేజోమూర్తులు సగర్వంగా నాటక రంగంనుండి వేదిక నుండి వెండితెరకు వెళ్ళారు. అలా వెళ్ళిన వారిలో ఒకరైన రేలంగి వెంకట్రామయ్య తూర్పు గోదావరి జిల్లా రావులపాడులో 1919 ఆగస్టు 9 న జన్మించారు. వీరి తండ్రి రామస్వామి హర్మోనియం పెట్టెలు రిపేరు చేస్తుంటే తను సహాయ పడేవారు. పెద్దగా చదువు అబ్బకపోయినా, నటన పట్ల ఆసక్తితో కాకినాడ లోని 'యంగ్ మ్యాన్స్  హ్యాపీక్లబ్ ' లో చేరి పలు ప్రదర్సనలు యిస్తుండేవారు. నాటి ప్రముఖ సిని, స్టేజి హాస్యనటుడు జోగినాధం గారి వద్ద శిష్యరికం చేయమని ప్రముఖ సినీ దర్మకుడు చిత్తజల్లు పుల్లయ్యగారు సలహా యివ్వడంతో అలానే చేసారు. (1935-ఏప్రిల్ 12)న విడుదలైన 'శ్రీకృష్ణతులాభారం' చిత్రంలో రేలంగి తొలిసారిగా వసుదేవుని పాత్రలో నటించి 75 రూపాయల పారితోషికం పొందారు. ఇంకా ఈచిత్రంలో 'ఋష్యేంద్రమణి', 'కాంచనమాల', 'లక్ష్మిరాజ్యం' వంటి వారు కూడా పరిచయం చేయబడ్దారు. అనంతరం మీర్జాపురం రాజావారు నిర్మించిన 'గొల్లభామ' (1949) లో నటించారు (అంజలి దేవి ఇదే చిత్రంలో పరిచయం చేయబడ్డారు ) ఈ రెండు చిత్రాలకు రేలంగి సహాయ దర్మకుడిగా పనిచేసారు. 'గుణసుందరి కథ' నటించారు.(15-3-1951) న విడుదలైన 'పాతాళభైరవి' చిత్రంలో రాణిగారు (విమలారావు ) తమ్ముడిగా నటిస్తూ 'తాళలేనే నేతాళలేనే'-'వినవే బాల నా ప్రేమగోల' పాటలు స్వయంగా పాడుకున్నారు. అనంతరం వాహిని వారి 'పెద్దమనుషులు' చిత్రంలో తిక్కశంకరయ్య పాత్ర అద్బుతంగా పోషించారు. (12-1-1955) న విడుదలైన విజయా వారి 'మిస్సమ్మ' చిత్రంలో దేవయ్య పాత్ర పోషిస్తూ 'ధర్మంచెయిబాబు' - 'సీతారాం సీతారాం' పాటలు స్వయంగా పాడుకున్నారు. (14-1-1959) విడుదలైన 'అప్పు చేసి పప్పు కూడు' చిత్రంలో భజగోవిందం పాత్ర బాగానటించారు. (19-4-1962) విడుదలైన 'భీష్మ' (9-4-1962) విడుదలైన 'చెంచులక్ష్మి' చిత్రాలలో నారదుని పాత్ర ధరించారు. అంజలిదేవితో 'సతీసక్కుబాయి', ఎస్ . వరలక్ష్మి గారితో 'మామకు తగ్ గఅల్లుడు' (1960) లో' సావిత్రి గారితొ కథానాయకుడిగా నటించారు. తన కుమారుని పేరు మీద 'సమాజం' అనే చిత్రం నిర్మించారు. తాడేపల్లిగూడెంలో 'రేలంగిమందిర్ ' అనే సినిమా ధియోటర్ నిర్మించారు. వీరి కుమారుడు సత్యనారాయణ బాబు బాలనటుడుగా నటించిన చిత్రం 'రాజయోగం'(1968) ఆ రోజుల్లో రేలంగికి జరిగినన్ని సన్మానాలు మరే నటుడికి జరుగలేదు. ఆస్ధానకవి శ్రీపాదకృష్ణమూర్తి రేలంగికి 'హాస్యనటచక్రవర్తి' బిరుదు ప్రదానం చేసారు. సినీ నటులలో తొలి 'పద్మశ్రీ' అవార్డు గ్రహితగా గుర్తింపు పొందారు. తొలితరం నటుడిగా జీవితాన్ని ప్రారంభించి 500 పైగా చిత్రాలలో నటించినా, తన ఉన్నతికి కారణమైన నాటకరంగాన్ని మరువకుండా, తరచూ ప్రదర్మనలుయిస్తూ 'చింతామణి' నాటకంలో 'సుబ్బిశెట్టి 'పాత్రవంలసార్లు పోషించారు. అలానే (11-4-1956) విడుదలైన 'చింతామణి' చిత్రంలో సుబ్బిశెట్టి పాత్ర పోషించారు. ఇంకా 'మనదేశం' (24-11-1949)  'జయసింహ' (21-10-1955)  'మాయబజా' (27-3-1957)  'వీరకంకణం' (16-51957) 'వద్దంటేడబ్బు'  (25-6-1954) 'రాజుపేద' (6-11-1959)  'బండరాముడు' (27-51960)  'రాణిరత్నప్రభ'  (9-8-1961) 'జగదేకవీరునికథ' (7-6-1962) వంటి చిత్రాలలో తన నట వైదుష్యంతో నవ్వించిన రేలంగి (27-11-1975) న కన్నుమూసారు.