గర్వభంగం - సరికొండ శ్రీనివాసరాజు

Garvabhangam

ఆ అడవిలో ఒక జింక చాలా అందంగా ఉండేది. దాని అందాన్ని చాలా జంతువులు పొగిడేవి. జింక అందాన్ని చూసి దానితో పెద్ద పెద్ద జంతువులే స్నేహం చేసేవి. దానితో జింకకు పొగరు బాగా పెరిగింది. చిన్న చిన్న జంతువులను, తనకు అందంలో నచ్చని జంతువులను హేళన చేసేది. కొన్ని జంతువులతో అసలే మాట్లాడక పోయేది. పలకరిచినా వాటిని గుర్రుగా చూస్తూ వెళ్ళిపోయేది. దానికి ఎలా బుద్ధి చెప్పాలా అని చాలా జీవాలు ఆలోచించేవి. ఒకరోజు జింక ఒక కుందేలుని చూసి హేళన చేయసాగింది. కుందేలు అందంగా ఉన్నదని విర్రవీగ వద్దని, తన అందం ముందు కుందేలు ఎందుకూ పనికిరాదని హేళన చేస్తుంది. కుందేలు ఎంతో సహనంతో హేళనలను భరిస్తుంది. కుందేలు జింకతో తనను పరుగు పందెంలో ఎవరూ ఓడించలేరని అంటుంది. "అవును." అంది అక్కడే తిరుగుతున్న నెమలి. జింకకు పౌరుషం వచ్చింది. ఇప్పుడే పరుగు పందెం పెట్టుకుందాం అన్నది. ప్రారంభం అయ్యింది. కుందేలు జింక రెండూ దాదాపు సమాన వేగంతో పరుగెత్తుతున్నాయి. కాకపొతే కుందేలు ముందు, దానికి వెంట్రుక వాసి దూరంలో జింక పరుగెత్తుతున్నాయి. కుందేలు జింకకు పొగరు అణచడానికి ఈ పందెం పెట్టింది. దాని మనసులో ఒక వ్యూహం ఉన్నది. కుందేలు అకస్మాత్తుగా పక్కకు దిశ మార్చింది. దానికి వెంట్రుక వాసి దూరంలో ఉన్న జింక బాగా మురికిగా ఉన్న బురదలో పడి, చాలా అసహ్యంగా అయ్యింది. చెట్టు మీద ఉన్న రామ చిలక ఎగురుతూ వెళ్ళి, అడవి అంతా ప్రచారం చేసింది. చాలా పక్షులు, జంతువులు అక్కడ గుమికూడాయి. జింక పరువు పోయింది. పొగరు అణిగింది. జింక ఆ అడవిని విడిచి, వెళ్ళి పోయింది. ఎప్పుడూ విర్ర వీగలేదు.

మరిన్ని కథలు

Aatmeeya poushyam
ఆత్మీయ పౌష్యం
- మణి వడ్లమాని
Badhyatha
భాధ్యత
- మధనా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
Manavatwam bratike vundi
మానవత్వం బ్రతికేవుంది
- డా:సి.హెచ్.ప్రతాప్
Jeevamrutham
జీవామృతం
- డా:సి.హెచ్.ప్రతాప్
Nirnamyam
నిర్ణయం
- జి.ఆర్.భాస్కర బాబు
Manchi snehiitulu
మంచి స్నేహితులు
- డా. సి.యస్.జి. కృష్ణమాచార్యులు
Kaanuka
కానుక
- డా:సి.హెచ్.ప్రతాప్
Manavatwama nuvuu ekkada
మానవత్వమా నువ్వు ఎక్కడ?
- హేమావతి బొబ్బు