పురాణాలు, ఉపనిషద్ భావాల ఆధునికీకరణ - Sai prashanthi N

Puranalu mariyu upanishad Bhavala aadhunikikarana

పురాణ కథలు - విద్యార్ధులు మరియు యువత : కథలు మరియు భావనల ఆధునికీకరణ సాయి ప్రశాంతి సూక్ష్మ జీవ శాస్త్ర విభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఛాత్రాణాం అధ్యాయనం తపః విద్యా దదాతి వినయం పురాణాల నుండి గ్రహించిన ఈ రెండు వాక్యాలు చాలా ముఖ్యమైనవి. ఈ రెండు వాక్యాలు విద్య మరియు విద్యార్ధులకు సంబంధించినవి. జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో యువత జనాభా చాలా ఎక్కువ. పిల్లలు మరియు మరియు యువత దేశాన్ని శక్తివంతం చేస్తారు అన్నింటిలో మొదటిది, మనం విద్యను అందించాలి మనిషిలోని పరిపూర్ణతని వ్యక్తీకరించేది విద్య అని స్వామి వివేకానంద ఉద్ఘాటించారు శీలనిర్మాణం యొక్క ప్రాముఖ్యత విద్య, డబ్బు సంపాదనకు బదులుగా శీల నిర్మాణం కలిగించే విద్యని విద్యార్ధులకి మనం అందించాలి. ఆధ్యాత్మికతని మరియు మతపరమైన జీవన విధానాన్ని విద్య లో భాగంగా చేయాలి. సత్యం వంటి మానవతా విలువలు ప్రవేశపెట్టాలి. దీనికి మనకు అనేక మార్గాలు ఉన్నాయి. విద్యను అందించడం పౌరాణిక కథలు వాటి విలువల ఆధారంగా విద్య ను అందించడం ద్వారా విద్యార్ధుల సమగ్ర వికాసం సాధ్యమవుతుంది వ్యాస మహర్షి మొదలైన ఋషులు రాసిన వాజ్మయం, పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవి నైతిక, ధార్మిక విలువల కథలను కలిగి ఉన్నాయి. మనం ఎలా జీవించాలి ఏది సరైనది మరియ ఏది తప్పు?నియమాలు ఏమిటి ? మరియు వారి వృత్తిలో విజయం సాధించడం దానితో పాటుగా సమాజ శ్రేయస్సుకు కూడా ఉపయోగపడే పనులు చేయడం గురించి కథల రూపంలో వివరించబడ్డాయి. మనకు 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, రామాయణం, భాగవతం మొదలైన ఇతిహాసాలు ఉన్నాయి పురాణాల నుండి కథలు: పురాణాల నుండి,మహాభారతం నుండి మనకు కథలు ఉన్నాయి. విద్యార్థులు విద్యను అభ్యసించే తరుణంలో ఏ విధంగా పరిశ్రమించాలి, ఏ విధంగా ఏకాగ్రత కలిగి ఉండాలి అనే గొప్ప లక్షణాలకి అర్జునుడు ఉదాహరణ. గురువు మార్గదర్శకత్వంలో ఏకాగ్రత ఎలా అలవరచుకోవచ్చో ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. ద్రోణాచార్య దగ్గర అర్జునుడు విద్యను అభ్యసించాడు. గురుకులంలో చాలా సంవత్సరాలు అతను పగలు మరియు రాత్రి సాధన చేసేవాడు, అలా అర్జునుడు విలువిద్యలో అత్యున్నత ప్రతిభను సాధించాడు. ఇది విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్ధులు అందరికీ ఆదర్శం. అతనికి సవ్యసాచి అనే మరో పేరు ఉంది. అంటే అతను రెండు చేతులను సమానమైన సమర్థతతో విలువిద్యలో ఒకే విధంగా ఉపయోగించగలడు. అర్జునుడు , ద్రోణాచార్యులు మరియు ఇతర శిష్యులు అడవికి వెళతారు అప్పుడు ద్రోణాచార్యుడు ఒక పరీక్ష పెడతాడు. వారి ఏకాగ్రతకి పరీక్ష అది. శిష్యులందరికీ చెట్టుని చూపించి మీకేమి కనిపిస్తుంది అని అడిగాడు. అందరూ చెరొక సమాధానంచెప్పారు. అర్జునుడు మాత్రమే పక్షి కన్ను కనిపిస్తుంది అని చెెప్పాడు. పక్షి కన్నుని లక్ష్యంగా చేసుకుని అర్జునుడు జయించాడు ఏకాగ్రత ద్వారా ఏదైనా సాధించబడుతుంది అలా సాధించాలంటే ప్రతిరోజూ సాధన చేయాలి. విద్యార్థి జీవితానికి దీనిని ఖచ్చితంగా విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవచ్చు. వారి జీవితంలో ఏ రంగంలో ఉన్నా, ఈ ఏకాగ్రత ని,పరిశ్రమని అలవరచుకుంటే వ్యక్తిగత మరియు ఉద్యోగ జీవితంలో వారు విజయవంతం అవుతారు. మనం ఏకలవ్య కథను తీసుకున్నప్పుడు, పట్టుదల, విషయంపై శ్రద్ధ,మరియు స్వయం ప్రతిపత్తి, విలువిద్యను గురువు సహాయం లేకుండానే నేర్చుకున్న గొప్ప పరిశ్రమకి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకంటే అతని కులం కారణంగా ద్రోణాచార్య అతన్ని తిరస్కరించాడు కానీ అతను గురువుయొక్క విగ్రహాన్ని చేసాడు ద్రోణాచార్యుని గురువుగా పరిగణించారు. అలా, చివరికి విలువిద్య సాధన ప్రారంభించాడు అద్భుతమైన విలువిద్యా పారంగతుడు అయ్యాడు.కానీ విషాదకరంగా అతను గురువు గురుదక్షిణ అడిగితే త్యాగం చేశాడు. అది మనకు గురువు యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేస్తుంది. అది విద్యార్థుల జీవితాల్లోకి వర్తింపజేస్తే వారు చేయని ఉపాధ్యాయుల పట్ల గౌరవంగా ప్రవర్తిస్తారు. గ్రేడ్‌ల కంటే జ్ఞానం మరియు వ్యక్తిత్వం ముఖ్యమని వారికి చిన్ననాటి నుండి నేర్పాలి. జ్ఞానం పట్ల ప్రేమ అత్యున్నతంగా ఉండాలి విద్యార్థులకు ప్రేరణ, శ్రేష్ఠ వ్యక్తిత్వం ని పై ఉదాహరణల ద్వారా నేర్చుకోవచ్చు. పురాణాలలో, ఉపనిషత్తులలో మనకు మరిన్ని గొప్ప పాత్రలు ఉన్నాయి 1.ధృవ = అత్యున్నత సంకల్పం, బలమైన శక్తి 2. ప్రహ్లాద = విశ్వాసం 3. నచికేత = శ్రద్ధ, ప్రేమ జ్ఞానం 4. హరిశ్చంద్ర = సత్యము 5. సీత = స్వచ్ఛత, ధైర్యం 6. శిబి చక్రవర్తి = త్యాగం 7. భగీరథ = సంకల్ప శక్తి 8. పౌండ్రక వాసుదేవ = అనుకరించవద్దు మొదలైనవి. పురాణాల నుండి భావనలు: దేవీ భాగవతం, గొప్ప పురాణాలలో ఒకటి మనము దానినుండి ఒక ఉదాహరణ తీసుకుంటే నైపుణ్యాలకు సంబంధించి ఒక మంచి వాక్యాన్ని మనం చూడవచ్చు. దుర్గా మాత స్వయంగా చెప్పింది, విశ్వశాంతికై నైపుణ్యాలు ఎలా ఉపయోగపడాలి. "చాతుర్యస్య ఫలం శాంతి సతతం ప్రియా భావనః " ఈ పంక్తులు చెప్పే విషయం ఏమిటంటే నైపుణ్యాలను సమాజం మరియు సార్వత్రికం సంక్షేమం కోసం, శాంతి శ్రేయస్సుల కోసం సంపాదించాలి. విశ్వ వినాశనానికి కాదు. మనము ఈ విలువను యువత మనస్సులలో పెంపొందించినట్లయితే ఖచ్చితంగా విద్య యొక్క ప్రయోజనం ఉంటుంది నైపుణ్యాలు విధ్వంసం కలిగించకూడదు అనే విషయం వారికి అవగతమవుతుంది. ఉపనిషత్తుల నుండి భావనలు: మనకు 108 ఉపనిషత్తులు ఉన్నాయి శాశ్వతమన జ్ఞానం మరియు అత్యున్నత ఆధ్యాత్మిక అనుభవాలు.. అందులో వివరించబడ్డాయి. ఉపనిషత్ ఋషుల మధ్య చర్చలు జరుగుతాయి వాటి ద్వారా అనేక రహస్యాలు వెల్లడవుతాయి. తైత్తిరీయ ఉపనిషత్తులో విద్య గురించి ఆత్మజ్ఞానము గురించి వివరించబడింది. అది మూడు భాగాలను కలిగి ఉంటుంది 1.శిక్ష వల్లి 2. భృగు వల్లి 3.ఆనంద వల్లి శిక్ష వల్లి తైత్తరీయ ఉపనిషత్తు మొదటి భాగము శిక్ష గురించి వివరించే ఉపనిషత్తుఅంటే విద్య గురించి వివరించే ఉపనిషత్తు భాగం ఇది. గురువు మరియు శిష్యుల మధ్య సంబంధ గురించి ఇలా వివరించబడింది. "ఆచార్య పూర్వ రూపం అంతేవాస్యుతార రూపం విద్యా సంధి " ఉపాధ్యాయుడు విద్యను ఇచ్చే వ్యక్తి జ్ఞానాన్ని గ్రహించేది విద్యార్థి విద్య అనునది ఇద్దరిమధ్య బంధాన్ని కలుగజేసి వారిని మిళితం చేస్తుంది తైత్తిరీయ ఉపనిషత్తు నుండి ఈ భావన ఉంటే మన ఆధునిక విద్యకు వర్తిస్తుంది ఆదర్శ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు: మార్కండేయ పురాణం నుండి మదాలసోపాఖ్యానం తల్లిదండ్రులు పిల్లలకు ఏమి ఇవ్వాలి రాణీ మదాలస తనలోని అంతర్గత దైవత్వాన్ని మేలుకొలిపింది. తన పిల్లలకి ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని జోలపాటల ద్వారా అందించింది పిల్లలు గొప్ప యోగులు అయ్యారు తల్లిదండ్రుల నుండి పోషణ పిల్లలకి అందితే వారు గొప్పగా ఎదుగుతారు. మాతృత్వానికి రాణి మదాలస ఉదాహరణ ఒక గొప్ప ఉదాహరణ. మన పురాణాలలో చాలా మంది గొప్ప గురువులున్నారు వేేదవ్యాసుడు గొప్పవాడువేదాలను విభజించిన ఋషి.వసిష్ఠ మహర్షి మరియు వంటి ఎందరో మహానుభావులు ఉన్నారు. రాముని గురువైన విశ్వామిత్ర మహర్షి మరియు శ్రీకృష్ణుని గురువు సాందీపని మహర్షి,లాంటి వారెందరో ఉన్నారు. మంచి ఉద్యోగి యొక్క గుణాలు: మహాభారతంలో, మంచి ఉద్యోగి యొక్క లక్షణాలను పేర్కొన్నారు. ఇందులో విదురుడు అనే గొప్ప పండితుడు ఈ లక్షణాలను ప్రస్తావించారు ఉదాహరణక ఒక ఉద్యోగి తెలివైన, పదునైన వారు అయి ఉండాలి సత్యవంతులు, పనికి కట్టుబడి ఉండాలి.వారు అందరిలో పనిచేసే నేర్పరి తనం మరియు స్ఫూర్తిని కలిగియుండాలి. వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలి. ఇవి విశ్లేషించడం ద్వారా ఉద్యోగులను ఎంచుకోవాలి అని విదురుడు వివరించాడు. పిల్లలలో మరియు యువతలో నైతిక విలువలు మరియు సమర్థతని మేల్కొల్పటానికిపౌరాణిక కథలు ఉత్తమ సాధనం.నెమ్మదిగా వారి మనస్సు మరియు హృదయం ధర్మ మార్గంలో మలచబడుతుంది నైతిక విలువలు : 1.సత్యం 2.ధర్మము 3.శాంతి 4. ప్రేమ 5.అహింస వేదాలలో మరియు ఉపనిషత్తులలో అత్యున్నత శాశ్వత సత్యాలు పురాణాలు మరియు ఇతిహాసాల కథల రూపంలో వివరించబడ్డాయి విద్యబోధనలో మనం ఆ కథలను పౌరాణిక పాత్రల ఉదాహరణల రూపంలో తీసుకోవచ్చు. అలా అయితే పిల్లలు సులభంగా అర్థం చేసుకుంటారు వివిధ మార్గాల ద్వారా కథలను చెప్పాలి అనగా ఆడియో విజువల్స్, చిత్రాలు మరియు ఆటలు మొదలైనవి. ఇదేయువతకి నేర్పిస్తే కథయొక్క మూల నైతిక విలువతో కథ యొక్క సంఘటనలని వివరించాలి. చివరగా, మనిషిని మనిషిగా మలచే విద్య ముఖ్యమైనది. మన యువ తరాన్ని శక్తివంతం చేయాలంటే కథలు మరియు భావనల ఆధునికీకరణ అనేది ఉత్తమ మార్గం. భారతీయులుగా అది మన ప్రధాన లక్ష్యం విద్య ఉత్తమ ఆయుధం కనుక మొత్తం ప్రపంచాన్ని మార్చగలదు.