సంగెం లక్ష్మీబాయమ్మ. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

సంగెం లక్ష్మీబాయమ్మ.
 
 
 
సంగెం లక్ష్మీబాయమ్మ.
సంఘసేవకురాలు, స్వాతంత్ర్య సమరయోధురాలు, రాష్ట్రమంత్రి,తెలుగునాట తొలి పార్లమెంటరీ మెంబరు అయిన ఈమె 1911జులై 27 న నేటి తెలంగాణా లోని రంగారెడ్డి జిల్లా ఘట్ కేసరిలో జన్మించారు.ఈమె తండ్రి డి. రామయ్య చిన్నతనంలోనే వివాహమైన తర్వాత బాల్యంలోనే తల్లిదండ్రులు, భర్త చనిపోవడంతో ఆమె అనాథ అయ్యింది.గుంటూరు శారదా నికేతన్ లో తెలుగు,సంస్కృత భాషలలో వవిద్యాభ్యాసం కొనసాగించారు.చాలా చురుకైన అమ్మాయి కావడంతో మద్రాసుఆంధ్ర మహిళా సభలో చదువుకునే అవకాశం దొరికింది. మద్రాసు ఆర్ట్స్ కళాశాలలో చదువుకున్నారు. కార్వే మహిళా విశ్వవిద్యాలయం,పూనా నుండి 1942లో పట్టభద్రులు అయ్యారు.అక్కడ ఉన్నత చదువుల అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంది. నారాయణగూడా ఉన్న రాజాబహద్దూర్ ఉమెన్స్ కాలేజి హాస్టల్ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర పోషించింది. ఎంతోమంది మహిళలను ఉద్యమాల్లో భాగస్వాములను చేసింది.
ఈమె సాంఘిక సేవలోనే పూర్తి సమయం వెచ్చించి ఆ తర్వాత రాజకీయాలలో చేరారు. ఈమె విద్యార్థి రోజులలో సైమన్ కమీషన్ను వ్యతిరేకించింది. ఉప్పు సత్యాగ్రహం (1930-31) లో చురుగ్గా పాల్గొని ఒక సంవత్సరం చెరసాల శిక్ష అనుభవించింది.
ఈమె 1952 లో నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1954 నుండి 1956 వరకు రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ ఉప మంత్రిగా పదవిని నిర్వహించారు. 1957లో మెదక్‌ నియోజక వర్గం నుండి ఎన్నికయ్యారు. 1967లోనాలుగో సారి లోక్ సభ సభ్యురాలిగా మెదక్ నియోజకవర్గంనుండి నుండి ఎన్నికయ్యారు.
ఈమె1979లో మరణించేవరకు లక్ష్మీబాయి స్తీ, బాలికల సంక్షేమం కొరకు నిర్విరామంగా కృషిచేసింది. 1952లో తన సహచరులై కే.వి.రంగారెడ్డి.,ఏ,శ్యామలాదేవి, పి.లలితాదేవి, పాశం పాపయ్య, ఎం.భోజ్ రెడ్డిలతో కలిసి మహిళలు, బాలికలకు సహాయం చేసే లక్ష్యంతో ఇందిరా సేవా సదన్ స్థాపించింది. ప్రస్తుతం సతోష్ నగర్ చౌరాస్తాలో ప్రస్తుతం ఐ.ఎస్.సదన్ గా పిలవబడుతున్న ప్రాంతంలో ఈమెకు రెండెకరాల స్థలంలో ఇల్లుండేది. తన సొంత ఇంటిలోనే అనాథశరణాలయాన్ని ప్రారంభించింది.2002లో ఇందిరా సేవాసదన్ న్ను సంగెం లక్ష్శిబాయమ్మ విద్యా పీఠంగా మార్చారు.ఇందులో మహిళల పాఠశాల,జూనియర్ కళాశాల,డిగ్రీ కళాశాల,ఇంజనీరింగ్ కళాశాల,ఫార్మసీ కళాశాలలు ఇప్పటికీ నడుస్తున్నాయి.
లక్ష్మీబాయి ఇందిరా సేవాసదన్ అనే అనాథశరణాలయానికి వ్యవస్థాపక సభ్యురాలు, గౌరవ కార్యదర్శి. ఇదే కాకుండా ఈమె రాధికా మెటర్నిటీ హోమ్, వసు శిశువిహార్, మాశెట్టి హనుమంతుగుప్తా బాలికల ఉన్నత పాఠశాలల యొక్క స్థాపనలో ముఖ్యపాత్ర వహించింది. ఈమె ఆచార్యవినోభావే యొక్క తొలి పాదయాత్రకు తెలంగాణాలో సారథ్యం వహించారు. ఇవే కాక హైదరాబాదు యాదవ మహాజన సమాజం యొక్క అధ్యక్షురాలిగా, అఖిలభారత విద్యార్థిసంఘం ఉపాధ్యక్ష్యురాలిగా, హైదరాబాదు ఫుడ్ కౌన్సిల్, ఆంధ్ర యువతి మండలి అధ్యక్షురాలిగా పనిచేసింది. ఆంధ్రప్రదేశ్ సా జిక సంక్షేమ సలహా బోర్డుకు కోశాధికారిగా, హైదరాబాదు ప్రదేశ్ కాంగ్రేస్ యొక్క మహిళా విభాగానికి కన్వీనరుగాను ఉంది. ఈమె పద్దెనిమిదేళ్ల పాటు ఆంధ్ర మహిళా సభ యొక్క సభ్యురాలిగా ఉంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికారిగా కొన్నాళ్లు, అఖిల భారత కాంగ్రెసు కమిటీ అధికారిగా కొన్నాళ్లు పనిచేసింది.పధ్నాలుగేళ్ళపాటు పార్లమెంటేరియన్ గాఉన్న ఈ సేవారత్నం 1979 జూన్ 2 వతేదిన శాశ్విత నిద్రలో ఒరిగిపోయారు.