శిష్యుని ఎంపిక. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Sishyuni empika

అవంతి రాజ్య పొలిమేరలలో సదానందుడు ఉచిత వసతితో విద్యాదానంచేస్తున్నాడు.ఒకరోజు పాఠం చెపుతుండగా,నలుగురు యువకులు ఆశ్రమంలోని వచ్చి సదానందునికి నమస్కరించారు.వారినికూర్చోమని చెప్పి ,పాఠంకొనసాగించసాగాడు సదానందుడు."నాయనలారా తల్లి, తండ్రి ,గురువు,దైవం, అన్నారు పెద్దలుగురుఃబ్రహ్మ గురుర్ విష్ణుః గురుదేవో మహేశ్వరః యిలా గురువుకి ఉన్నతస్ధానం కలదు.

అటువంటి గురువుగారి కథ మీరుతెలుసుకునేముందు సప్తగురువులగురించి తెలియజేస్తాను.

1)సూచక గురువు-చదువు చెప్పేవాడు.2)వాచక గురువు-కుల ఆశ్రమ ధర్మాలను బోధించేవాడు.3)బోధక గురువు-మహమంత్రాలను ఉపదేశించేవాడు4)నిషిధ్ధ గురువు-వశీకరణ,మారణ ప్రయోగాలు నేర్పించేవాడు 5)విహిత గురువు-విషయభోగాలపై విరక్తి కలిగించేవాడు. 6)కారణ గురువు-జీవ బ్రహ్మెైక్యాన్ని భోధించేవాడు 7)పరమగురువు పరమాత్మ అనిప్రత్యక్షానుభవాన్ని కలిగించేవాడు. వీరుకాకుండా,అన్నంపెట్టి వసతి కలిగించివిద్యనేర్పినవారిని గురువు అంటారు.తనవద్దకు వచ్చినవారికి విధ్యనేర్పిన వారిని ఉపాధ్యాయుడు అంటారు.తనశిష్యులకు ఉపనయంచేసి అన్న వస్త్ర వసతి ఏర్పరిచి వేదాలను, ఉపనిషత్తులను అధ్యాయనం చేయించేవారిని ఆచార్యుడు అంటారు.

సహనం ఇది నొప్పి మరియు ఆనందం, చలి మరియు వేడి, దుఃఖం మరియు సంతోషాలు వంటి వ్యతిరేకతలను - ప్రశాంతంగా, ఆందోళన లేకుండా మరియు ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక లేకుండా వేచి ఉండగల, భరించగల సామర్థ్యం. వ్యక్తుల మధ్య సంబంధాలలో, సద్గుణ తితిక్ష అంటే ఎవరైనా కారణం లేకుండా దాడి చేసినా లేదా అవమానించినా, శత్రుత్వం, కోపం, పగ లేదా ఆందోళన లేకుండా దానిని భరించాలి. సహనం అనే భావన విశ్వాసం కంటే ఎక్కువ అని మరియు ఒకరి శరీరం మరియు మనస్సు యొక్క స్థితిని ప్రతిబింబించే విలువగా వివరించబడింది. పరీక్షా అనే పదంకొన్నిసార్లు ఇతర సందర్భాలలో పరీక్ష లేదా పరీక్షగా కూడా అనువదించబడుతుంది. ఈ భావనలలో కొన్ని యోగా యొక్క ఆధ్యాత్మిక అవగాహనలోకి తీసుకువెళ్ళబడ్డాయి. హిందూమతంలోని శాండిల్య ఉపనిషత్తు సహనం మరియు సహనం యొక్క పది మూలాలను గుర్తిస్తుంది: అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచార్య, దయ, ఆర్జవ, క్షమా, ధృతి, మితాహార మరియు సౌచ. ఈ పది సహనాల్లో ప్రతి ఒక్కదానిలో, ఈ సహనశీలతలు ఒకరికి మార్గదర్శకంగా ఉంటే మన ప్రస్తుత స్ఫూర్తి మరియు తనతో సహా ప్రతి ఒక్కరి భవిష్యత్తు బలంగా ఉంటుందని అవ్యక్తమైన నమ్మకం. ఆ పది పరీక్షా యొక్క ప్రతి మూలం:

అహింస (అహింస) అనేది ఒక వ్యక్తి యొక్క చర్య ద్వారా, మాట్లాడే లేదా వ్రాసే పదాలతో లేదా ఒకరి ఆలోచనల ద్వారా ఏ సమయంలోనైనా ఏ మానవునికి మరియు ఏ జీవికి హింసాత్మకంగా ఉండకూడదు. సత్య సత్యాన్ని వ్యక్తీకరిస్తూ, ప్రవర్తిస్తున్నాడు. అస్తేయ అనేది ఒకరి మనస్సు, మాట లేదా శరీరం యొక్క ఏదైనా చర్య ద్వారా మరొకరి ఆస్తిని కోరుకోవడం కాదు. బ్రహ్మచర్య అనేది ఒకరి మనస్సు, వాక్కు లేదా శరీరం యొక్క చర్యల ద్వారా బ్రహ్మచారిగా ఉండటానికి ఇష్టపడటం. దయా అనేది ప్రతి ఒక్కరి పట్ల మరియు అన్ని జీవుల పట్ల షరతులు లేని దయ. ఆర్జవ అనేది ఒకరి మనస్సు, మాట లేదా శరీరం యొక్క పనితీరు ద్వారా లేదా పనితీరు ద్వారా ఇతరులను మోసగించడానికి లేదా తప్పు చేయడానికి నిరాకరించడం. క్షమా అనేది ఇతరుల ప్రశంసలు లేదా దెబ్బలు వంటి అన్ని ఆహ్లాదకరమైన లేదా అసహ్యకరమైన విషయాలను క్షమించేటప్పుడు బాధలను అంగీకరించడం. ధృతి అనేది సంపద లేదా బంధువుల లాభం లేదా నష్టాల సమయంలో ప్రశాంతమైన మనస్సు మరియు ఆత్మతో ఉండాలనే సంకల్పం. మితాహార అనేది ఆహారం, పానీయాలు మరియు సంపద వినియోగంలో మితంగా మరియు నిగ్రహం. సౌచ అనేది భూమి మరియు నీటి ద్వారా శరీరాన్ని శుభ్రపరచడం; మరియు తనను తాను అర్థం చేసుకునే ప్రయత్నయత్నంచేయడం. ఈరోజుకు పాఠం ఇక్కడకు స్వస్తి.

ఆశ్రమంలోనికివచ్చిన నలుగురు యువకులు సదానందుని నమస్కరిస్తూ"స్వామి మేము ఉన్నత విద్యలు అభ్యసించాము,తమవద్ద జ్ఞాన భోధన పొందాలని ఆశిస్తూన్నాము"అన్నారు.

" సంతోషం మీకోరికతీరుతుంది.నాయనాలారా మీలోఒకరు ప్రతిరోజు ఆశ్రమం పరిసరాలను పరిశుభ్రపరచండి,ఒకరు మన వ్యవసాయభూములు సాగుచేయండి, మరోకరు మనపండ్లతోటలు, కాయకూరల పెంపకంచూడండి, మరోకరు ఆశ్రమంలోని విద్యార్ధులు అందరికిభోజనం,వసతి,పరివేక్షించండి "అన్నాడు సదానందుడు.

"అలాగే"అన్నయువకులు తమలో తామే తలా ఒక పనినిర్ణయించుకుని చేయసాగారు.కొంతకాలానికి వ్యవసాయం చేసేయువకుడు "స్వామి నేను వచ్చింది మీవద్ద జ్ఞానం పొందడానికి ,వ్యవసాయంచేయాలిఅంటే నాకు చాలాభూమిఉంది శెలవు "అన్నాడు. "నాయనా శ్రమించడం కష్టమనుకున్నావు ,మరినీలక్ష్యంచేరాలంటే ఎంతోశ్రమించాలి నీలోకోరికఉందికాని శ్రమించేగుణం లేదు,శ్రమించనిదే ఏదిసాధించలేము వెళ్ళిరా"అన్నాడు సదానందుడు .

మరికొన్ని రోజులకు పండ్లతొట చూసేయువకుడు,ఆశ్రమాన్ని శుబ్రపరిచే యువకుడు సదానందునివద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయారు.

ఆశ్రమవాసులకు సేవలందిస్తున్న యువకుని చూసి "నాయనా నేను కాశీయాత్రచేయాలి అనుకుంటున్నాను.వయసులో పెద్దవాడిని ఎక్కువ దూరం నడువలేను,నాకుతోడుగా నువ్వువస్తే అలసటకలిగినప్పుడు నీభుజాలపై ఎక్కించుకుని తీసుకువెళ్ళగలవా?"అన్నాడు.సదానందుడు.

"అలాగేస్వామి దైవస్వరూపులైన గురువును మోసే అదృష్టం నాకు కలిగించారు"అన్నాడు ఆయువకుడు సదానందునికి నమస్కరిస్తూ." నాయనా ఒకలక్ష్యాన్నిచేరుకోవాలిఅంటే ఓర్పు,సహనం,పట్టుదల,

అవగాహన,నేర్పు ఎంతోఅవసరం నేను పెట్టిన పరిక్షలో నీవునెగ్గావు .మనంకాశీ వెళ్ళడంలేదు రేపటినుండి నీకు జ్ఞానబోధన ప్రారంభం" అన్నాడు సదానందుడు.

మరిన్ని కథలు

Vuppena
ఉప్పెన
- కందర్ప మూర్తి
అహల్య
అహల్య
- సుమ సావి3
Viswasa pareeksha
విశ్వాస పరీక్ష!
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Katha addam tirigindi
కథ అడ్డం తిరిగింది
- టి. వి. యెల్. గాయత్రి
Naalugu taraala katha
నాలుగు తరాల కథ
- హేమావతి బొబ్బు
Marina manishi
మారిన మనిషి
- శ్రీమతి లతా మూర్తి
Baamma cheppina bhale kathalu
బామ్మ చెప్పిన భలే కథలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు