ఫలించిన యుక్తి - ఆదూరి.హైమావతి

The resulting maneuver

పూర్వం పరిపూర్ణ దేశాన్ని ' పూజిత వర్మ ' అనే రాజు పరిపలిస్తూ ఉండే వాడు.ఆయన తన ప్రజల ను కన్న బిడ్డల్లాగా చూసుకునే వాడు. ఎవ్వరికి ఏ అవసరమైనా స్వయంగా వెళ్ళి , ఆ ఏర్పాట్లు గావించే వాడు. రాజ్యంలోని ప్రజలంతా త్రాగునీరు ,సాగునీరు కోసం ఏనాడూ ఇబ్బం దులు పడలేదు. ప్రజలంతా మహారాజును తండ్రిలా , దేవునిలా చూసు కునేవారు. ఆయన మాటే ప్రజలకు వేదవాఃక్కు.

తమదేశంలో కష్టపడి పంటలు పండించే అన్నదాతలకు సరైనరీతిలో మేలు చేయా లని సంక ల్పించాడు. దీనికోసం ముందు ఎంత సంకటపరిస్థితి ఎదురైనా తన ఆలోచనకు రూప కల్పన చేయాలని నిర్ణయించుకున్నాడు.

మహారాజు ఆదేశంలో వ్యాపారరులంతా రైతులు పండించే పంటలను రాజు నిర్ణ యించిన ధర కు కొనాలనీ, వాటిని విదేశాల్లో అమ్ముకోవచ్చనీ ప్రకటించాడు.దీనివల్ల పేదరైతులంతా లాభపడ గా, వ్యాపారులు తమకు నష్టం కలిగిందని బాధపడ్దారు. వ్యాపారులు తమ లాభాల్లో పదో వంతు పన్నుగా చెల్లించాలనే నిబంధన పె ట్టాడు. అదీ వారికి కష్టంగా తోచింది.కాని రాజాఙ్ఞ ధిక్క రించే ధైర్యం లేనందున పన్నుచెల్లిస్తూ ఉండే వారు.

ఇలాఉండగా మహారాజుగారి ఏకైక కుమారుని విధ్యాభ్యాసం పూర్తై ,గురుదేవులు అతడ్ని మహా రాజు కు అప్పగించను వచ్చారు. మహారాజుగారు గురుదేవులను సాద రంగా ఆహ్వానించి , అర్ఘ్యపాద్యా దులు సమర్పించుకుని, తమ పుత్రుని సకల విద్యా వంతుని చేసినందుకు, కృత ఙ్ఞతలు తెలుపు కున్నా రు రాజదంపతులు. గురుదేవులు సంతృప్తితో ,

" మహారాజా! తమ బిడ్డడే కాదు,ఈ'పరిపూర్ణ'దేశానికి కాబోయే మహారాజు.రాజు విద్యా వంతుడు, గుణవంతుడు ఐతేనే కదా, రాజ్యంలోని ప్రజలంతా సుఖ శాంతులతో వర్ధి ల్లేది! అందువల్ల మేం చేసిన పనేం గొప్పది కాదు, పైగా అది మా కర్తవ్యంకూడా . మహా రాజా !అన్నట్లు మేమొక మాట చూచాయగా విన్నాం , వేగులవలన...."

"గురుదేవా ! మీరు ఏం విన్నారో , మీకు అభ్యంతరం లేకుంటే మేం తెలుసుకోవచ్చా!" అని మహారాజు అడుగగా ,"తప్పక మహారాజా! మీకు తెలుపాలనే నేను వచ్చాను.మన రాజ్యంలోని వ్యాపారులు కొంత అసంతృప్తిగా ఉన్నట్లు విన్నాం. వారు తమ లాభాల్లో ఎక్కువభాగం పన్నుగా చెల్లించను ఇష్టపడటం లేదనీ, వారంతా ఒక సంఘంగా ఏర్పడి తమతో ఏదో విన్న వించుకోవా లని ఆలోచన చేస్తున్నట్లు తెలియ వచ్చింది. ..."

" అవును గురుదేవా! మేమూ చారులవలన ఆవిషయం విన్నాం.కానీ వారు అధిక లాభాలు గడించి,ఒక రోజుకు మహా రాజుల మైన మమ్ములనే మించిన ధనవంతులు కావచ్చు, అంతేకాక వ్యాపారులంతా అధిక ధనవంతు లైనపుడు, రాజోద్యోగులు కూడా తమ పనులు మానేసి, లాభా పేక్షతో వారూ వ్యాపారానికి దిగవచ్చు.ఇపుడు మనం ప్రజ లందరిపైనా పన్నులు వేయడం లేదు. వ్యాపారులు చెల్లించే పన్నులతోనే ప్రజా సౌక ర్యాలు చేస్తున్నాం.అందుకే ప్రజలంతా రాజవిధేయులై సుఖంగా ఉంటున్నారు. పేద వారు సైతం తిండికి, బట్టకూ ఇబ్బంది పడటం లేదు. నేను అది ఆలోచిస్తున్నాను గురు దేవా!" అన్నాడు మహారాజు.

"మాహారాజా! నాకో ఉపాయం తోస్తున్నది. మనదేశంలోని వ్యాపారులను వారికి ఇష్టమైతే ఇతర దేశాలకు వ్యాపారాలు చేసుకు వెళ్ళి వ్యాపారాలు చేసుకోవచ్చనీ ఆలాభాల్లో ఏ మాత్రం పన్ను చెల్లించక్కర్లేదనీ ప్రకటించండి.వారికి అప్పుడు ఇతరదేశాల్లోవ్యాపారం, చెల్లిం చేపన్ను గురిం చీ అవగాహన కలుగు తుంది.పైగా మన దేశీయ వస్తువులకు ఇతర దేశాల్లో గిరాకీ కలుగు తుంది. మీరూ బాగా యోచించి నిర్ణయించండి "అనిసలహా ఇచ్చా రు గురుదేవులు .

"తప్పక గురుదేవా! మీ సూచన పాటిస్తాను." అని సగౌరవంగా గురుదేవుని సాగనంపారు మహా రాజు.

ఇతరమంత్రులందరితో యోచించి గురువుగారిచ్చిన సూచన బావుందని అంతా నిర్ణయిం చాక , మహారాజు ఆవిషయాన్ని ప్రకటించారు .

ఈప్రకటన విని వ్యాపారులంతా ఒక కూటమిగా తయారై ,చాలా సంతోషంగా మహా రాజు కు ధన్య వాదాలు చెప్పుకుని, తాము ఇతరదేశాలకు వ్యాపారార్ధం వెళ్ళను అను మతి పత్రాలు పొందారు.

అలా చాలామంది వ్యాపారులు ఇతరదేశాల బాటపట్టారు. ఎక్కడాలభించని ఎన్నో వస్తువులు పరిపూర్ణ దేశంలో విరివిగా లభించటాన వాటికి బాగా గిరాకీ పెరిగి రైతులంతా ఆయా పంటలు బాగాపండించి అమ్ముకుని సొమ్ము చేసుకోసాగారు.

ఇతరదేశాలకు వెళ్ళిన వ్యాపారుల కు , కొంతకాలానికి ఆ యాదేశాల రాజులు విధించే పన్ను లు చెల్లించడం చాలా కష్టంగా ఉండటాన , తాము చేస్తున్న వ్యాపారానికీ తమ రాజుకు చెల్లించే పన్నూ పోల్చుకుని వారంతా తమ వ్యాపారాలు కట్టేసుకుని స్వదేశాని కి తిరిగి వచ్చారు.

ఇతర దేశాల్లో పరిపూర్ణ దేశంలో పండే వస్తువులకు అలవాటైన ఆయాదేశాల ప్రజలు పరి పూర్ణ దేశానికి వచ్చి వస్తుకొనుగోలు నేరుగా పండించిన వారినుంచే చేయడంతో రైతులకు లాభం చేకూ రింది. వ్యాపారులు తాముకట్టేపన్ను , తాము అక్కడ చేసిన వ్యాపారా నికి ఇతర దేశాలకు కట్టే దానికంటే తక్కువగా ఉన్నందున మౌనంగా ఉండి పోయారు.

మహారాజు ఇతర దేశా లనుండీ వస్తువులు కొనే వారిపైనే పన్ను స్వీకరిస్తూ , తనదేశం లోని వ్యాపారులవద్ద వసూలుచేసే పన్ను తగ్గించారు. ఇలా వ్యాపారులకు పైదేశాల్లో వ్యాపారం గురిం చీ అర్ధమై మహారాజుకు ధన్యవాదాలు చెప్పుకున్నారు. తమదేశంలో కష్టపడి పంటలు పండిం చే అన్నదాతలకు సరైనరీతిలో మేలు చేయాలని సంకల్పిం చాడు. దీనికోసం ముందు ఎంత సంకటపరిస్థితి ఎదురైనా తన ఆలోచనకు రూపకల్పన చేయాలని నిర్ణయిం చుకున్నాడు. ఇలా మహారాజు యోచన కార్యరూపం దాల్చి రైతు లంతా సంతోషించగా, వ్యాపారులు తమలాభాలు తమకు మిగులుతున్నందుకు ,ఇతర దేశాల్లో వ్యాపారం పట్ల అవగాహన కలిగి సంతోషించారు. కష్టము నష్టము తర్వాత సుఖము లాభము రుచి బాగా తెల్సి ప్రజలు తృప్తి పడ్దారు. మహారాజు యుక్తి ఫలించిం ది. ఏవాస్తవమైన నిదానంగా ఆవగాహన అవు తుంది. నిదానమే ప్రధానం.

కష్ట సుఖములు రెండును కలసి యుండు

వాని విదదీయ నెవరికి వశముకాదు

సుఖము ప్రత్యేకముగ నెందు చూడరాదు

కష్టము ఫలించెనని సుఖంబటండ్రు.

మరిన్ని కథలు

Aame kavvinchindi
ఆమె కవ్వించింది
- తాత మోహనకృష్ణ
Chandruniko noolu pogu
చంద్రునికో నూలు పోగు
- కాశీవిశ్వనాధం పట్రాయుడు/kasi viswanadham patrayudu
Anaadha atidhyam
అనాథ అతిథ్యం
- - బోగా పురుషోత్తం
Vibheeshana Sharanu
విభిషణుని శరణు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Srivariki prema lekha
శ్రీవారికి ప్రేమలేఖ
- తాత మోహనకృష్ణ
Ramdaas formula
రాందాస్ ఫార్ములా
- వీరేశ్వర రావు మూల
Attagari samrajyam
అత్తగారి సామ్రాజ్యం
- బొబ్బు హేమావతి