కాకి కుతూహలం - కృష్ణ చైతన్య ధర్మాన

crow interest

అనగనగా దేవాది అనే గ్రామంలో ఒక చెరువు ఒడ్డున ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు పైన రెండు కాకులు కొత్తగా జీవితాన్ని ఆరంభించాయి. ఆ చెట్టుకి ఒక తొర్ర ఉంది. రోజూ సాయంత్రం ఆరుగంటల సమయానికి ఆ తొర్రలోనికి ఒక పాము దూరుతుంది. ఒక అరగంట తరువాత అదే తొర్రలోనికి ఒక ఎలుక దూరుతుంది. మరుసటి రోజు పొద్దున్నే, ముందుగా ఎలుక ఆ తొర్రలోనుంచి బయటకు వస్తుంది. కాసేపటి తరువాత పాము బయటకు వస్తుంది. ఇది ఆ చెట్టు వద్ద రోజూ జరిగే బాగోతమే! కానీ చెట్టుపైకి కొత్తగా వచ్చిన రెండు కాకులకు ఆ సంగతి తెలీదు. ఆ కాకులు మొదటిసారి చూసినపుడు ఎలుకను ఆపబోయాయి. కానీ ఎలుక తొర్రలోనికి పరిగెత్తింది. మరుసటి రోజు ఉదయం నవ్వుతూ బయటకు వచ్చిన ఎలుకను చూసి కాకులు రెండూ ఆశ్చర్యపోయాయి. రెండు రోజులు ఇదే జరగడంతో అసలు లోపల ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహులం ఆ కాకులలో బాగా పెరిగింది. "ఇవాళ రాత్రి ఆ తొర్రలోనికి దూరి ఎలాగైనా ఆ గుట్టుని కనిపెట్టాలి!" అని అరిచింది ఆడకాకి. "అవును నేను కూడా నీతోవస్తా!" అని అరిచింది మగకాకి. చెట్టు పైన ఆడే మాటలు తొర్రలోనికి చక్కగా వినిపిస్తాయి. అందువలన ఆ కాకుల మాటలను ఎలుక, పాములు విని ఎప్పటిలాగానే సిద్ధపడ్డాయి. ఆ రోజు రాత్రి రెండు కాకులు తొర్రలోనికి దూరాయి. చాటుగా దాక్కున్న పాము ఒక కాకి మెడను కొరికింది. మరో చాటుగా దాక్కున్న ఎలుక ఇంకొక కాకి మెడను కొరికింది. వాటికి చక్కటి విందు లభించింది. నీతి: మన ముందు వింతలు జరిగినప్పుడు, వాటి వెనుక ఉన్న మోసం గ్రహించకుండా అనవసరమైన కుతూహలం, ఆవేశం ప్రదర్శించరాదు.

మరిన్ని కథలు

Vuppena
ఉప్పెన
- కందర్ప మూర్తి
అహల్య
అహల్య
- సుమ సావి3
Viswasa pareeksha
విశ్వాస పరీక్ష!
- - బోగా పురుషోత్తం, తుంబూరు.
Katha addam tirigindi
కథ అడ్డం తిరిగింది
- టి. వి. యెల్. గాయత్రి
Naalugu taraala katha
నాలుగు తరాల కథ
- హేమావతి బొబ్బు
Marina manishi
మారిన మనిషి
- శ్రీమతి లతా మూర్తి