"ఓ పుణ్యాత్ముడు నరకం చేరాడు" - నల్లబాటి రాఘవేంద్రరావు

O punyatmudu narakam cheraduu

పట్టాభిరామచంద్రం రక్తసంబంధీకుల వల్లే ఆస్తి పంపకాల విషయంలో చాలా అవమానాలు పడ్డాడు. తన అన్న గోపాలరావు తనవీధిలో వీధిజనం అందరూ చూస్తుండగా తనను కర్రలతో కొట్టించాడు. అంతేనా పెద్దమనుషు లను నియ మించి వాళ్లకు లంచం ఎరచూపి తనను నానా దుర్భాషలాడించాడు. తను ఉమ్మడిలో కోట్లాది రూపాయలు దాచేసు కున్నట్టు బంధుజనంలో చెడుగా ప్రచారం చేయించి వాళ్లని నమ్మేలా చేశాడు. చివరికి తల్లి మనసు కూడా తనమీద ఇరిగిపోయేలా ఆమెను రెచ్చగొట్టి,.. భయపెట్టి లోబరుచు కుని..తన తల్లిచేతే తన ముఖం పై ఉమ్ము వేయించాడు.. చెప్పుతో కొట్టించాడు. అభం శుభం తెలియని మరో ఆఖరితమ్ముడు కి కూడా తనపై అసహ్యం కలిగేలా నూరిపోసి వాడితో తనపై ఏకంగా గునపంతో హత్యా ప్రయత్నం చేయించాడు. తన భార్యను సైతం అందరూ కలసి దుర్భాషలాడి కించపరిచారు. గాలి కోసం ఉమ్మడిలో తనుఉంటున్న భాగానికి దొడ్లోకి వచ్చేలా చిన్న కిటికీ పెట్టు కుంటే .. పంపకాలు అయ్యేవరకు వీల్లేదని... పోలీసు లను..లాయర్లను తీసుకొచ్చి అది మూయించే శాడు. ముదరాగ.. తను ఇచ్చినంత డబ్బులు తీసుకొని వాటా ఆస్తిని వదిలి వెళ్లిపోవా లని రౌడీల చేత బెదిరించాడు.. తన అన్న. తను దారిలోకి రావడం లేదని.. దారిలోకి రావడం కోసం పోలీస్ క్రిమినల్ కేస్ పెట్టిం చాడు. తను కత్తితో దాడి చేయకపోయినా తనే చేసినట్టు కథలు అల్లి, కత్తిని కూడా సృష్టించి.. దొంగ సాక్ష్యా లను సైతం నిర్ణయించి కేసు ఫైల్ చేయించి తనను స్టేషన్లో కూర్చోబెట్టించి... రెండేళ్లు కోర్టుల చుట్టూ కూడా తిప్పించాడు... పాపాత్ముడు తన అన్న!! ఇలాంటి మరెన్నో ..అన్న గోపాలరావు భయం కర చర్యలతో నరకం మొత్తం భూమి మీదే అనుభవించేసి.. చచ్చిపోవాలనికూడాఅనుకొన్నాడు...పట్టాభిరామచంద్రం..ఇదంతా కేవలం ఉన్న ఒకే ఒక్క ఉమ్మడి ఇంటి పంపకాల విషయంలో!!! ఇలా........ ఐదు సంవత్సరాలు తన అన్న వల్ల యమలోకపు బాధల కన్నా వందరెట్లు ఎక్కువ బాధలు అనుభవించాడు పట్టాభి రామ చంద్రం. తన అన్న లో 'గోముఖవ్యాగ్రం ' ని నిజంగా చూసేసాడు. 'తేనెపూసిన కత్తి ' అంటే ఏమిటో పూర్తిగా అర్థమయింది. చివరకు అప్పుడుఅన్నకు ,తల్లికి,ఆఖరి తమ్ముడికి.. పెద్దలు నిర్ణయించిన ఆస్తిని వదిలేసి.. తనకు ఎంతిస్తే అంతే తీసుకొని.. ఆఖరుకి తల్లి ఆస్తి భాగంపై కూడా..... హక్కును తను మనస్ఫూర్తి గా.... ఎవరి బలవంతము లేకుండా వదులు కొంటున్నట్టు.. ఒప్పుంటు న్నానని.... అక్రమ విధా నంలో తన అన్న గోపాలరావు దస్తావేజులు తయారుచేయించి సంతకాలు పెట్టించి పంపకాలు పూర్తి చేయించాడు. 0000000 0000000 0000 ఇదంతా జరిగి 20 సంవత్సరాలు గడిచింది!!. రోజూ...ఊరిమధ్య రావిచెట్టుకింద పెద్దల బండపై కూర్చొని ఇదేవిషయం గుర్తుకు తెచ్చుకొని తన కొలీగ్ కనకలింగానికి... ఇంకా మిగిలిన వాళ్ళంద రికీ కథలు కథలుగా చెప్పు కుంటూ తెగబాధ పడుతూ... ఉండేవాడు పట్టాభిరామచంద్రం . ఇప్పుడు పట్టాభిరామచంద్రం వయస్సు ఎని మిది పదులు. వృద్ధాప్యమైనా .. చిన్ని చిన్న రుగ్మతలు తప్ప బలంగానే ఉన్నాడు. తన అన్నకు మరో రెండేళ్లు ఎక్కువ.తప్పని పరి స్థితుల్లో అతని దగ్గరే ఉండవలసి వచ్చిన తన తల్లికి నూరేళ్లు దగ్గరపడు తున్న వయసు!! " ఒరేయ్ కనకలింగం.. నాకు వయసు ఎనభై దగ్గర పడుతుంది. కానీ నన్ను ఓ. ' ధర్మ సందేహం ' పీక్కుని తింటుందని.. నీకు తెలుసుకదా. దానికి నువ్వు ఏమీ సమాధానం చెప్పలేకపోతున్నావు. ఇది ఇంతేనా !!??. సృష్టిలో ధర్మం లేదా??".... నిలదీస్తున్నట్టు అడిగాడు కొలీగ్ కనకలింగాన్ని పట్టాభి రామచంద్రం . " ఇదిగో... రామచంద్రం.. రోజు ఇలా అడిగితే చెప్పడానికి నేను ఏమైనా మహాపండితుడు నా?! మన పక్కఊర్లో పురాణపురుషోత్తమ రావుగారు.. ఉన్నారుగా.. శాస్త్రాల్లో ఘనాపాటి. మనల్ని 'ఒరేయ్ ..ఒరేయ్'...... అంటాడు కదా.. పసల పూడి నుండి వస్తుంటాడు. నీకు బాగా తెలుసు కదా. ఈమధ్య మనఊర్లో శివాలయంలోప్రతిరోజు పురాణం చెప్తున్నాడు. రోజుకు ఒక ఘట్టం!!జనం తండోపతండాలుగా వస్తున్నారు. ఆయన దగ్గరికి వెళ్లిపోదాం.. నీ ధర్మ సందేహానికి సమా ధానం ఆయనే చెప్ప గలరు. ఈరోజు వినాయకునికి 'గణనాథుడు' అనే పేరు ఎలా వచ్చింది అన్న విషయం మీద పురాణం. రారా..కాసేపు అక్కడ కూర్చుని ఆయన చెప్పింది విని పురాణం అయ్యాక పురాణ పురుషోత్తమ రావుగారి నే ...నీ ధర్మ సందేహా నికి వివరణ ఇవ్వమని అడుగుదాం"....అంటూ రావి చెట్టు కింద పెద్దలబండ మీద కూర్చున్న మిత్రుడు పట్టాభిరామచంద్రాన్ని బలవంతంగా శివాలయానికిలాక్కెళ్లాడు....కనకలింగం. oooooo. ooooooo. oo " అందుచేత ఈ పురాణ పురుషోత్తమరావు చెప్పేది ఏమిటంటే.. వినాయకునిలా తల్లి దండ్రుల చుట్టూ భక్తితో ముమ్మారు ప్రదక్షిణ చేస్తే ముమ్మారు విశ్వప్రదక్షిణ చేసిన ఫలితం దక్కు తుంది ..అది "సృష్టిరహస్యం" !! కుమారస్వామి ఈ రహస్యం తెలుసుకోకుండా తన వాహనం మీద కష్టపడి కష్టపడి ముమ్మారు విశ్వ ప్రదర్శన చేసివచ్చి ఫలితం దక్కక అమాయకుడిలా, వెర్రివాడిలా నోరెళ్లబెట్టాడు.. పాపం...!! ప్రజలారా దీన్నిబట్టి అందరం అర్థం చేసుకోవలసింది ఏమిటంటే.................." పురాణ పురుషోత్తమరావుగారు ఇంకా ఏదో చెబుతూనేఉన్నారు. ఇంతలో కరెంటు పోయింది!!!! పురాణం ముగింపు సందర్భం కావడంతో జనం అంతా వెళ్ళిపోతున్నారు. దూరంగా నిలబడి ఉన్నారు.. పట్టాభిరామ చంద్రం, కనక లింగం. వాళ్లని చూశాడు పురాణ పురుషోత్తమరావు. " రండ్రా... ఇప్పుడే వచ్చినట్టున్నారు. మీరు రోజూ వస్తుండండి ..వయసు పైబడిన వాళ్లు కదా మంచిముక్కలు వినటం ఆరోగ్యానికి మంచిది". పురాణ పురుషోత్తమరావు పలకరింపుతో ఇద్దరూ దగ్గరగా వచ్చి కూర్చున్నారు. " మాదొక 'ధర్మసందేహం'.. గురువుగారు". " అడగండ్రా.. తీర్చడానికే కదా నేను ఉన్నది." " పాపాత్ములు ఏ రోగాలు లేకుండా హాయిగా మంచి ఆరోగ్యంతో పిల్లాపాపలతో అష్టైశ్వ ర్యాలతో ఉంటున్నారు. ఇదెలా??? పురాణంలో కథలు ఉదాహరణలుగా చెప్పొద్దు పురుషోత్త మరావు గారు... అలాగే పూర్వజన్మ సుకృతం అని కూడా అనొద్దు.. మాకు తృప్తిగా ఉండేలా వివరణ ఇవ్వండి ".. అడిగాడు పట్టాభి రామ చంద్రం. " భలేగుందిరా... రెండుకాళ్లకు రెండుబంధాలు వేసి పరుగుపందెంలో పాల్గొనమన్నాడట!!!.... వెన కటికి..... నీలాంటోడే. అయినా నువ్వు ఈ ధర్మసందేహం ఎందుకు అడిగావో నాకు అర్థంమయిందిలే. నీ కుటుంబసమస్యలు అన్ని నాకు పూర్తిగా తెలుసుగా. నా దగ్గరకి కూడా మీ అన్నదమ్ముల తగువు వచ్చింది. అయినా ఈ వయసులో హాయిగా ఉండకుండా ఎందుకురా నీకీ సందేహాలు.. చచ్చుబండలు!!" " హాయిగా ఉండలేకపోతున్నాను గురువుగారు. మా అన్న గురించి కాదు కానీ.. ఈ విధంగా చాలా చోట్ల జరుగుతుంది. నేను చాలా సంఘ టనలు గమనించాను. జీవితం చివరి వరకూ ఏ కర్మ అనుభవించకుండా........ పాపాత్ములు కూడా ఎలా హాయిగా ఉంటున్నారో ..నాకు అర్థం కావడం లేదు.. ఇది ధర్మవిరుద్ధం, సృష్టి విరుద్ధం... చెప్పా లంటే దైవతప్పిదంలా నాకనిపిస్తుంది గురువు గారు ఇది ఎట్లా ???" " నాకు తెలుసురా నీ అన్న నీ పట్లే కాదు సమాజం పట్ల కూడా చాలా తప్పులు చేశాడు. ఇది జగ మెరిగిన సత్యం. అయినా రాజభోగం అనుభవి స్తున్నాడు. నువ్వు దైవభక్తుడువి. నాకు తెలుసుంటుండగాపూజలకు..పునస్కారా లకు.. లక్షలు ఖర్చు పెట్టావు.. అయినా నీ పని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉంది. ఇది ఎట్లా అంటే ??? ఇది ఎట్లా అంటే???.... అంటే? .." పురాణ పురుషోత్తమరావు.. ఆలో చించి ఏదో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నట్టు గ్రహించాడు పట్టాభిరామచంద్రం. " పాపంపండితే అనుభవిస్తారు"........" దేనికైనా సమయం రావాలి కదా"....... అనొద్దు గురువు గారు.....పాపం ఎప్పుడు పండుద్ది.? ఎనభై సంవత్సరాలు హాయిగా బ్రతికేసాడు కదా మా అన్న కూడా! పాడి పంటలు, రాజాబంగళాలు, కార్లు, నౌకర్లు, మణిమాణిక్యాల వైభోగం! నిండు నూరుపాళ్ళ హోదా.. అనుభవించవలసిన రాజభోగం ఇంకేమీ లేదుగురువుగారు.....ఓ... కొడుకులు,కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మన వలు... ఇప్పుడు ఈ వయసులో ఇంకా ఏదో ఫ్యాక్టరీ కూడా కట్టబోతున్నాడట!దొడ్లో చిన్న షెడ్డు వేసి అందులో పెట్టాడు నాతల్లిని. మా అమ్మకు ఎంత కష్టం వచ్చిందో చూడండి.. ఎంత నరకం అనుభవిస్తుందో చూడండి.. వాడుమూర్ఖుడు కాదంటారా? పాపాత్ముడు కాదంటారా? దేవుడికి దండం పెట్టడువీడు.. అయినా దేవుడు బాగానే చూస్తున్నాడు. ఇదేమి బాగోలేదు పురుషోత్తమ రావు గారు"... ...ఊగిపోతూ అన్నాడు పట్టాభి రామచంద్రం. " ఒరేయ్.. నువ్వు చాలావేడికాక మీద ఉన్నావు. ఈ పరిస్థితుల్లో నీకు చెప్పినా అర్థం అవ్వదు." " వద్దు గురువుగారు.. చెప్పొద్దు.. మే వెళ్తాం.. మరోసారి కలుస్తాం.... ." సమాధానం విన కుండానే తన కొలీగ్ కనకలింగంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు పట్టాభి రామచంద్రం. పురాణ పురుషోత్తమరావు వేదాంత ధోరణిలో నవ్వుకున్నాడు. 000000 0000000 00 " హలో... కనకలింగం అన్నయ్యగారు.. నేనండీ సావిత్రిని.. మీ బావగారు.. కళ్ళుతిరిగి పడిపో యారు." పట్టాభిరామచంద్రం భార్య ఫోన్ కాల్ తో అంతే పరుగున వచ్చాడు కనకలింగం. వెంటనే ఇద్దరూ కలిసి దగ్గర్లోని పెద్దాస్పటల్ కి తీసు కెళ్లారు. డాక్టర్స్ అబ్జర్వేషన్లో ఉంచి అవసరమైన హెల్త్ చెక్అప్ లు చేశారు. సాయం త్రానికి రిపోర్ట్స్ వచ్చాయి. ' వ్యాధి ఏదైనా ఎట్టి పరిస్థితిలోనూ మూడు నెలలు మించి బ్రతకడం కష్టం'.....అదీ సారాంశం. తను విషయం తెలుసుకొని.. నీరస పడ్డాడు పట్టాభి రామచంద్రం.... మందులు తీసుకున్నారు. " ఏం చేస్తాం.. ఇన్నాళ్ళు బ్రతికాను ..చాలు ఎటొచ్చి మీ చెల్లెలుకు ఒక ఇల్లు కూడా కట్టించ లేకపోయాను. అది ఒకటే బాధరా కనకలింగం. పంపకాల్లో వచ్చిన ఇంటి భాగం కూడా నిల బెట్ట లేకపోయాను. సరే వెళ్లి పోదాం నడ వండి". .. పైకి లేచాడు హాస్పిటల్ బెడ్ మీద నుండి పట్టాభి రామచంద్రం. " ఆటో మీద వెళ్దాం" " వద్దు బాగానేఉంది నడవగలను." " పోనీ... స్ట్రెచర్ మీద గేటు వరకు దిగబెట్ట మని అడగనా.. ?" " వద్దురా నెమ్మదిగా వెళ్దాం." పట్టాభిరామచంద్రం కనకలింగం సహాయం తో నెమ్మదిగా హాస్పటల్ మెట్లు దిగుతు న్నాడు ... ఓ పక్క. మరోపక్క.. ఒకవృద్ధురాలిని పట్టుకొని నెమ్మ దిగా నడిపించుకుంటూ ఇద్దరు మనుషులు హాస్పటల్ లోకి వస్తున్నారు. " రామచంద్రం.. అదిగో రా మీ అమ్మ." చూపిం చాడు కనకలింగం. " అమ్మ.... నాకు అన్యాయం చేసింది కదా. ఒక పక్షాన చేరి నాతో యుద్ధం చేసింది. ఎవరో ఒకరు పక్షాన చేరితే.. చివరి జీవితం అంతా బాగుంటుం దని పెద్ద కొడుకు బెదిరింపులతో.. వాడి పక్షాన చేరి.. వాడు చెప్పినట్టు తందాన తాన అంటూ నాపై పోలీసు కేసు కు కూడా సై సై అంది. అబద్ధపు సాక్ష్యం చెప్పింది. ప్రపం చంలో అసలు చెడ్డతల్లి ఉండదంటారు. ఈమాట నిజంగా అబద్ధం రా. పెద్ద కొడుకు చెప్పినట్టు కోర్టులో కూడా జడ్జిగారి ముందు ఆయన మనసు కరిగేలా అబద్ధపు నటన చేసింది. కన్నతల్లి ఇలా చేయొచ్చా????" " ఇప్పుడు అవన్నీ ఎందుకురా. ఏ తల్లి అయినా పరిస్థితుల ప్రభావంతో ఒక్కోసారి అలా మార వచ్చు. అది తాత్కాలికం... ఎంతైనా తల్లితల్లే . నీ పరిస్థితి అసలు బాగుండ లేదు. ఆ విషయాలు, ఆలోచనలు పక్కన పెట్టు. ఓసారి 'అమ్మా ' అని పలకరించి చూడు..... ఆవిడ ఆనంద పడిపో తుంది." " వద్దురా పలకరిస్తే.. మళ్లీ కొట్టడానికి వచ్చానని దొంగకేసు పెట్టి దొంగసాక్ష్యం ఇస్తే." " గతం ఎందుకులే.. తల్లి కదా." " ఆ... కొడుకు కదా అన్న బుద్ధి ఆవిడకు ఉండాలి .తల్లికి ఆస్తి ఉంటే బాగుంటుందని.. పంపకాల్లో ఆవిడకు ఆస్తి దక్కేలా నేను చేస్తే.. ఆమెకు వచ్చిన భాగం అమ్మేసి డబ్బు కాజేశాడు ఆ పెద్దకొడుకు వెధవ! అయినాఈవిడకు బుద్ధి రాలేదు. ఏమైంది ప్పుడు.. కనీసం హాస్పిటల్ కి కూడా తీసుకొచ్చి చూపించడం లేదు... అదిగో పనోళ్ళు చేత నా తల్లిని పంపించాడు. ఎంత పాపం చేస్తున్నాడో చూడరా ఆ పాపాత్ముడు.. అయినా దేవుడు వాడినే రక్షిస్తున్నాడు. అసలు ఇట్లా ఎట్లా జరుగు తుంది? అన్న దాని రీజన్తెలియకుండానే నేను చచ్చిపోతానా? అది నా బాధ." పట్టాభిరామచంద్రం.. తల్లిని దూరం నుండే చూస్తూ గమనిస్తున్నాడు. ఆమె కొన్ని మెట్లు ఎక్కాక నీరసపడితే కూడా వచ్చినవాళ్ళు ఆమెను పైకెత్తి లోపలకు మోసుకు వస్తున్నారు. ఆమె ముఖం మాత్రంచాలా ధైర్యంగా ఉంది. ,' నీ కర్మ అనుభవించు'... అంటూ కదిలాడు పట్టాభి రామచంద్రం. oooooo. oooooo. oooo నెల గడిచింది. ఆరోగ్యం పరిస్థితి లోపల విషమిస్తున్న.. కాస్త స్థిమితంగానే ఉన్నాడు పట్టాభిరామచంద్రం. ప్రతిరోజు కనకలింగం వచ్చి తోడుగా ఉంటు న్నాడు. ఒక్కగానొక్క కొడుకు ఎక్కడో దూర ప్రాంతం లో ఉంటున్నాడు. "ఒరేయ్ కనకలింగం ఒకసారి రాజమండ్రి వెళ్దాంరా" . " ఇప్పుడా... ఎందుకు.... రాగలవా?" " చివరిరోజులు కదా ఒకసారి అలా తిరుగు దామని ఉంది. నువ్వు వెంట ఉంటే పర్వా లేదు. ఎలాగోలా నెమ్మదిగా రాగలను ". రాజమండ్రి వెళ్లారు.. ఇద్దరు. " గోదావరి.....' వేదంలా ఘోషించే గోదావరి' .. .. అన్నాడు.. ఒక మహానుభావుడు ఎంత అందంగా ఉందో చూడు. చాలురా.... నాకు చాలా ఆనం దంగా ఉంది . ఇప్పుడు ఒకసారి వెంకటసచ్చి దానందస్వామి వారిని కలిసి సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోదాం." " ఇప్పుడా.. . గోపాలమఠం వెళ్లాలి.... అయినా ఆయనతో పని ఏమిటి?" " చచ్చిపోయే ముందు ఒక 'ధర్మసందేహం'..... తీర్చుకోవాలిరా". " అర్థమైంది. నువ్వు వచ్చిన సంగతి అదన్న మాట.ఇంకా ఎందుకురా ఆ 'తలంపు' వదిలేయ వచ్చుగా." " కూడదురా.. వెళ్దాంపద... ఆయన ఏం చెబు తారో." ఇద్దరూ వెళ్లారు. వెంకటసచ్చిదానంద స్వామివారు చాలా ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు. పళ్ళుపూలు పాదాలదగ్గర పెట్టి నమస్క రించాడు పట్టాభిరామచంద్రం. " స్వామి ఒక ధర్మసందేహం తీర్చుకుందామని వచ్చాము". నవ్వారు.. వెంకటసచ్చిదానందస్వామివారు. " పాపాత్ములు సమస్యలు లేకుండా చిరకాలం ఆనందంగానే ఉంటున్నారు రోజు రోజు అభి వృద్ధి చెందుతున్నారు. పాప ఫలితం అనుభ వించడం లేదు. వచ్చే జన్మలో అనుభవిస్తే ఏముంది స్వామి .ఈ జన్మలో వాళ్లు చేసిన పాపం ఈజన్మ లోనే అనుభవించాలి కదా. అలాగైతే కదా అతని వల్ల దగా పడ్డవాళ్ళు.. కష్ట పడ్డ వాళ్ళు.. నష్టపడ్డ వాళ్లు.. అది చూచి వాళ్లు కూడా జాగ్రత్తగా ఉంటారు. అలా కాకుండా సృష్టికి విరుద్ధంగా జరుగుతుంది ఏమిటిస్వామి. ఇదే జీవితంలో చిట్టచివరగా నాకు మిగిలిన ధర్మసందేహం." " నాయనా.... నాకు పూలు పండ్లు తెచ్చావు. నా అనుచరులు తీసుకుని లోపల పెట్టారు. వాళ్లు నీకు మంచి తీర్థం అందించారు. బయట ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది... దాన్ని నువ్వు కనీసం ముట్టలేదు... ఎందుచేత?". "అదేమిటి స్వామి దానికి దీనికి సంబంధం ఏమిటి?" " ఉంటుంది నాయన నువ్వు అడిగింది అతి సూక్ష్మ ధర్మసందేహం. దానికి సమాధానం నేను చెప్పినా నీకు అర్థం కావాలంటే ముందు నీ మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి. మనసు లో మలినం అసలు ఉండకూడదు." " అదేమిటి స్వామి మంచినీళ్ళు తాగకపోతే నాలో మలినం ఉన్నట్టా?" " నీ ఆలోచన పవిత్రంగా ఉంటే వెంటనే దాహం తీర్చు కొంటావు. అది వక్రంగా ఉంటే.. ఏ పని నీకు మనసారా చేయాలనిపించదు. ఏం చెప్పిన.. అర్థమూ కాదు". " వేదాంతమా స్వామి.. సరే స్వామి నేను మళ్ళీ వస్తాను." " నీ ప్రశ్నకు సమాధానం.. నా దగ్గర ఉంది." " లేదులే స్వామి.. ఈసారి వస్తాగా.".. పట్టాభి రామచంద్రం.. కనుకలింగానికి సైగ చేశాడు. ఇద్దరు బయటకు వచ్చేస్తారు. ooooooo oooooooo. oooo మరో రెండు నెలలూ గడిచిపోయాయి. " హలో.. 'సందేహనివృత్తి' కార్యక్రమం..చెప్పండి మీ పేరు..?" " నమస్తే. నా పేరు పట్టాభిరామచంద్రం... నేను రామచంద్రపురం నుంచి మాట్లాడుతున్నాను. మేడమ్ నేను చాలాసేపటినుండి ట్రై చేస్తు న్నాను. ఫోన్ కలవడం లేదు. బాబాజీగారితో.. మాట్లాడాలి." " ముందు మీరు మీ టీవీ వాల్యూమ్ తగ్గించు కోండి. రామచంద్రంగారు.. మీ ప్రశ్న అడ గండి ... బాబాజి గారిని". " హలో ..బాబాజీగారు.. ముందుగా మీకు మన స్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను సార్." " సంతోషంగా ఉండండి రామచంద్రంగారు. మీ ప్రశ్న అడగండి." " బాబాజీగారు ..బాబాజీగారు..." " వినబడుతుంది రామచంద్రంగారు.. మీరు బాబాజీ గారితో మాట్లాడండి. మీరు మీ టీవీ వాల్యూమ్ ఇంకా తగ్గించి బాబాజీ గారిని ప్రశ్న అడగండి." " హలో.. హలో.." " వినిపిస్తుంది సార్. బాబాజీగారు వింటు న్నారు. ప్రశ్న అడగండి." " హలో.. బాబాజీగారు.. నాదో 'ధర్మసందేహం' సార్" హలో ..హలో.. హలో.." " మాట్లాడండి రామచంద్రంగారు.. బాబాజీగార్ని అడగండి.. హలో ..హలో ..హలో.. లైన్ కట్ అయింది" చిరాగ్గా టీవీ ఆఫ్ చేశాడు.. పట్టాభిరామచంద్రం. కానీ అప్పటికే తను కుర్చీలో ఒక పక్కకు ఒరిగిపోయిన విషయం తెలుసుకోలేక పోతు న్నాడు . పట్టాభిరామచంద్రం భార్య సావిత్రి ఫోన్ కాల్ తో.... కనకలింగం వచ్చేసాడు. అంబులెన్స్ తెప్పించి అతని భార్య సహాయంతో వెంటనే హాస్పటల్ లో చేర్పించాడు. డాక్టర్స్ ఎమర్జెన్సీ వార్డులో పరీక్షించారు. పెద్ద డాక్టరుగారు కేస్ షీట్ చూసి పెదవి విరిచారు.." చెప్పానుకదా.. నేను చెప్పిన గడువు అయి పోయింది. మనిషికి స్పృహ వచ్చింది. సృహ లోనే ఉంటాడు.. కానీ ఇక 48గంటలు మించి బ్రతకడు. కావలసిన వాళ్లను రప్పించండి. జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లిపొండి." పట్టాభి రామచంద్రానికి షేక్ హ్యాండ్ ఇచ్చి , భుజంతట్టి వెళ్లిపోయారు డాక్టరుగారు. " ఇంటికి వెళ్ళిపోదాంరా కనకలింగం. ఆ స్ట్రెచర్లు,అంబులెన్సు.. వద్దు. నాకు అదోలా ఉంటుంది. పర్లేదు.. నడవగలను.. మీరిద్దరూ చెరోపక్క పట్టుకుంటే చాలు.రోడ్డువరకు... నెమ్మదిగా వెళ్లి ఆటోఎక్కి ...ఇంటికి... వెళ్ళి పోదాం." పట్టాభి రామచంద్రం ఆయాసపడు తూ భార్య , కనకలింగం సహాయంతో.. నెమ్మ దిగా.. హాస్పటల్ మెట్లు దిగుతున్నాడు. మళ్లీ... అతని తల్లిని ఎవరో మోసుకొస్తూ హాస్పటల్ లోనికి ప్రవేశిస్తూ మెట్లు ఎక్కిస్తున్న సన్నివేశం!!! కూడా.. పెద్దకొడుకు ఉన్నాడేమోనని పరికిం చాడు పట్టాభిరామచంద్రం. అబ్బే లేడు. చి చి.. పాపా త్ముడు.. నీచుడు.. చండాలుడు.. తల్లిని గాలికి వదిలేశాడు......ఆలోచనలతో ఆయాసం వచ్చి ఆవేశంగా గట్టిగా దగ్గు కొన్నాడు... పట్టాభి రామచంద్రం బయటకు వెళుతూ. లోపలకోస్తూ అతని తల్లి... ఆ శబ్దానికి ఇటు వైపు ముఖం తిప్పి చూసింది. " తననే చూసిందా????!!!" ఉలిక్కిపడ్డాడు. ఆమెకు తాను కనిపిస్తున్నానో లేదో గానీ... ప్రస్ఫుటం గానే.... చూస్తూ ఉంది!! ఆమె నవ్వుతుంది కూడా. అది నవ్వా... లేక పళ్ళు ఊడిపోవడం వలన.. దవడలు లోపలకు పోయిన బాపతు సందర్భమో.. తెలియదు గానీ మొత్తానికి తనను చూసి....." నేను బాగు న్నాను.. నువ్వు బాగున్నావురా చిన్నోడా.."... అంటూ ప్రేమగా పలకరిస్తున్నట్టుగానే ఉంది ఆ మోము!!. ఒక క్షణం..... శరీరం జలదరించింది పట్టాభి రామచంద్రానికి...! ' సృష్టి '.... స్తంభించినట్టు అయిపోయింది.!! ఆ స్తంభన లోంచి ఒక కాంతిపుంజం...ఆమె నవ్వును తాకి...ఆనవ్వు ...తన...'ధర్మ సందే హానికి'......సమాధానంగా తన ముందుకు దూసుకువస్తున్నట్టు అనిపించింది...పట్టాభి రామచంద్రానికి!!!!. 3 నెలల క్రితం...... పురాణ పురుషోత్తమరావు ప్రవచనంలో చెప్పింది గుర్తొచ్చింది.....పట్టాభి రామ చంద్రానికిి....' వినాయకుడు తన తల్లి దండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తే విశ్వ ప్రదక్షణ చేసిన ఫలితం దక్కేేసిందని అప్పుడు ఆయన చెప్పగానే ఎగతాళిగా విన్నాను. పురాణ సంఘటనలు మానవ జీవితాలకు వరాలుగా మార్చుకొని అన్వయించుకోవాలి అన్న భావం అర్థం చేసుకో లేకపోయాను '.... చెంపలు వాయించు కొన్నాడు!! 2 నెలల క్రితం....వెంకటసచ్చిదానందస్వామి.. అలా అలా మదిలో మెదిలాడు... ' మానసిక ప్రశాంతత అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది'...... అన్న భావం వచ్చేలా ఆయన చెప్పింది.... వృద్ధుడనై ఉండి కూడా పెడచెవిని పెట్టాను.'. ... తల బాదుకున్నాడు... పట్టాభి రామచంద్రం!!! "నాఅన్న ....పాపాలుచేశాడు....కానీ..మంచిగానో.... చెడుగానో మొత్తానికి “తల్లిరుణం” తీర్చు కుంటున్నాడు. అందుకనే అతను బాగు న్నాడు.. హాయిగా ఉన్నాడు. అతను పాపా త్ముడే !! పాపాత్ముడే!!! కానీ ..కానీ.... 9 నెలలు గర్భాశయంలో నన్ను మోసి జన్మ నిచ్చిన తల్లిరుణం తీర్చుకోని..నేను.. నేనె వర్ని? అతను... పాపాత్ముడు అయితే....." నేనెవర్ని??? నేనెవర్ని????"!!! తన శరీరం 'చితాభస్మం' కావడానికి కొద్దిగంటల ముందు... పట్టాభిరామచంద్రం ప్రశ్నించుకుంటు న్నాడు...????!!!! ooooooo. oooooo. oooo

మరిన్ని కథలు

Kurukshetra sangramam.14
కురుక్షేత్ర సంగ్రామం. 14.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kurukshetra sangramam.13
కురుక్షేత్ర సంగ్రామం .13.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kurukshetra sangramam.12
కురుక్షేత్ర సంగ్రామం .12.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kurukshetra sangramam.11
కురుక్షేత్ర సంగ్రామం . 11.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kurukshetra sangramam.10
కురుక్షేత్ర సంగ్రామం .10.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Iddarammalu
ఇద్దరమ్మలు
- తిరువాయపాటి రాజగోపాల్
Modu chiguru todigindi
మోడు చిగురు తొడిగింది
- బి.రాజ్యలక్ష్మి
Pellaina kottalo
పెళ్ళైన కొత్తలో
- తాత మోహనకృష్ణ