వాయు దేముడు. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Vaayu demudu

వాయుదేవుడు .

పట్టువదలని విక్రమార్కుడు మరలా స్మశానం చేరుకుని చెట్టుపైన ఉన్న బేతాళునిబంధించి తనభుజంపైనచేర్చుకుని మౌనంగా నడవసాగాడు.

శవాన్ని ఆవహించిఉన్నబేతాళుడు "భళా విక్రమార్క నీపట్టుదల మెచ్చదగినది. నాకు వాయుదేవుడు గురించి తెలుసుకోవాలనిఉన్నది సకలకళావల్లభుడవైననీవు నాకు తెలియజేయి

తెలిసిచెప్పకపోయావో మరణిస్తావు "అన్నాడు.

" బేతాళా మనపురాణాల ప్రకారం వాయుదేవుడు అని చెప్పుకుంటారు. అష్టదిక్పాలకులలో ఒకడు. హిందూ మతానుసారం అతడు వాయవ్య దిక్కుకు అధిపతి.ఒక ప్రాధమిక హిందూ దేవత, గాలుల ప్రభువు, భీముడు తండ్రి, హనుమంతుడి ఆధ్యాత్మిక తండ్రిగా పరిగణిస్తారు.అలాగే ప్రకృతి ఉనికికి కారణమైన పృధ్వి, అగ్ని, నీరు, వాయువు, శూన్యం అనే మౌలికమైన పంచభూతాలకు చెందిన ఒకటిగా చెప్పుకోవచ్చు. "వాయు"ను ఇంకా గాలి, పవన, ప్రాణ అని వర్ణించారు.ఋగ్వేదం ప్రకారం రుద్ర అని కూడా వర్ణించారు.

పురాణ గ్రంధాల శ్లోకాలలో వాయు రెండు లేదా నలభై తొమ్మిది లేదా వెయ్యి తెల్లని గుర్రాలతో మెరిసే రధంపై అసాధారణమైన అందంతో శబ్దం చేస్తూ ఉంటాడని వర్ణించబడ్డాడు.అతని రధంపై తెలుపు జెండా ఉండటం ప్రధాన లక్షణం అని, ఇతర వాతావరణ దేవతల మాదిరిగానే, "శక్తివంతమైన వీరోచిత యుద్ధ విధ్వంసకుడు" అని వర్ణించబడింది.

ఉపనిషత్తులలో వాయు దేవుడు గొప్పతనం గురించి అనేక వివరణలు, దృష్టాంతాలు ఉన్నాయి. శారీరక విధులను నియంత్రించే దేవతలు ఒకప్పుడు వారిలో ఎవరు గొప్పవారో నిర్ణయించడానికి పోటీలో నిమగ్నమయ్యారని బృహదారణ్యక ఉపనిషత్తు పేర్కొంది. మనిషి శరీరాన్ని దృష్టి దేవత విడిచిపెట్టినప్పుడు, ఆ మనిషి చూపులేనివాడిగా ఉన్నప్పటికీ జీవించేఉంటాడు.ఆ దేవతలు తిరిగి తన పదవికి వచ్చిన తర్వాత కోల్పోయిన నష్టాలను పొందగలడు. ఒక్కొక్కటిగా దేవతలు అందరూ శరీరాన్ని విడిచిపెట్టి మలుపులు తీసుకున్నారు. కానీ మనిషి వివిధ విధాలుగా బలహీనంగా ఉన్నప్పటికీ జీవించడం కొనసాగించాడు. చివరగా "ప్రాణ" శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు మిగతా శారీరక విధులను నియంత్రించే దేవతలందరూ వాటి విధులను తప్పనిసరి పరిస్థితులలో నిర్వర్తించలేక పోయాయి. "ఒక శక్తివంతమైన గుర్రం అతను కట్టుబడి ఉన్న భూమిలో కొయ్యలను తీసివేసినట్లే." ఇతర దేవతలు వాయు చేత అధికారం పొందినప్పుడే పనిచేయగలరని గ్రహించాయి. మరొక వర్ణన ప్రకారం, దాడిలో ఉన్న పాపపు రాక్షసులచే బాధపడని ఏకైక దేవత "వాయు" అని చెప్పబడింది. వాయువును ఉడ్గిత (మంత్ర అక్షరం ఓం) గా మాత్రమేని తెలుసుకోవడం ద్వారా తప్ప, మాధ్వ బ్రాహ్మణులు కాదని చందోగ్య ఉపనిషత్తు పేర్కొంది.

నారదుడు ఒకరోజు హిమాలయ పర్వతాలలో సంచరించేటప్పుడు ఒక బూరుగు చెట్టు నారదునికి కనపడింది.బలమైన కాండంకలిగి,విస్తారమైన కొమ్మలతో, తన తెల్లటి దూది ఫలసాయంతో మరో మంచుకొండలాగా ఉండటం నారద మహర్షి చూసాడు.వేల అడుగుల ఎత్తులో ఉన్న ఇంతటి మహావృక్షం మనుగడ సాగించడం సాధ్యమేనా!’ అని మనస్సులో అనుకున్నాడు.తన మనస్సులోని అభిప్రాయం దాచుకోకుండా బూరుగచెట్టు వద్దకు వెళ్లి “నీవు ఇంత ఎత్తుబాగా విస్తరించి ఉన్నావుకదా! మరి నీకు ఆ వాయుదేవుని వల్ల ఏనాడూ నష్టం వాటిల్లలేదా? వాయుదేవుడు తన పవనాలతో నిన్ను విరిచేందుకు ప్రయత్నించలేదా! నీకూ వాయుదేవునికీ మధ్య ఏమన్నా బాంధవ్యం ఉందా ఏం?’’ అని అడిగాడు నారదుడు.

ఆ మాటలకు బూరుగుచెట్టుకు కోపం వచ్చింది.నేను ‘‘వాయుదేవుని స్నేహంతోనో, అతని దయాదాక్షిణ్యాలతోనో నేను జీవనం సాగించడం లేదు. నన్ను కూల్చేంత శక్తి వాయుదేవునికి లేదు. నా బలంతో పోలిస్తే వాయు బలం ఒక మూలకు కూడా రాదు,’’ అంటూ పరుషమైన మాటలెన్నో పలికింది. నారద మహర్షికి ఇటువంటి అవకాశాలు ఎదురుచూడటం అలవాటు.వాయుదేవుడను గురించి “నీవు ఇంత చులకనగా మాట్లాడటం సబబుగా లేదు! అతను తల్చుకుంటే ఎంతటి కొండలనైనా కదిలించేయగలడు.నీవు అన్న మాటలు అతనికి తెలిస్తే నీకు కీడు చేయక మానడు,’’ అని, బూరుగు చెట్టు గర్వంతో పరుషంగా మాట్లాడిన మాటలన్నింటినీ వాయుదేవునికి చేరవేశాడు.

బూరుగు చెట్టు తనని కించపరచడాన్ని వాయుదేవుడు సహించలేకపోయాడు. వెంటనే ఆగమేఘాల మీద బూరుగుని చేరుకుని ‘‘ఒకనాడు బ్రహ్మదేవుడు నీ చెంత సేదతీరాడన్న కారణంగా, ఇన్నాళ్లూ దయతలచి నీ జోలికి రాలేదు.నేను చూపిన కరుణ నీలో కృతజ్ఞతను కలిగించకపోగా, గర్వాన్ని రగిలించింది. రేపు ఈపాటికి నిన్ను ఏం చేస్తానో చూడు!’’ అంటూ కోపంతో వెళ్లాడు. వాయుదేవుడు కోపంతో అన్న మాటలకు బూరుగ గజగజ వణికిపోయింది.ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు.తనకు ఎవ్వరి వల్ల ఆపదలేదని దైర్యంతో పరుషంగా మాట్లాడి వాయుదేవునితోనే వైరం తెచ్చుకుంది. నారదుడు చెప్పినట్లు వాయుదేవుడు నిజంగా తల్చుకుంటే ఏమైనా చేయకలిగే సమర్థుడు.అతనికి ఎదురొడ్డి ఎలా నిలబడగలను. ఇప్పుడేం చేయడం! ఇలా పరిపరి విధాలా ఆలోచించిన బూరుగు చివరికి ఓ నిశ్చయానికి వచ్చింది. వాయుదేవుడు తనకు నష్టం కలిగించే లోపుగా తానే తన కొమ్మలనీ విరిచేసుకుంది, రెమ్మలన్నింటినీ తుంచేసుకుంది,పూలన్నింటినీ రాల్చేసింది. చిట్టచివరికి ఒక మోడుగా మారి,ఇప్పుడు వాయుదేవుడు నన్ను “నష్టపరిచేందుకు నా వద్ద ఏమీ మిగల్లేదు’ అన్న నమ్మకంతో వాయు రాక కోసం ఎదురుచూసింది.

మర్నాడు వాయుదేవుడు బూరుగ దగ్గరికి రానేవచ్చాడు. మోడులా నిలిచిన బూరుగుని చూసి జాలిపడ్డాడు.అప్పుడు బూరగతో ‘‘నేను విధించాలనుకున్న శిక్షను నువ్వే అమలుచేసుకున్నావు. ఇక మీదనైనా అహంకారాన్ని వీడి నమ్రతతో జీవనాన్ని సాగించు!’’ అంటూ సాగిపోయాడు.ఇందులో ఒక నీతి కూడా దాగుంది. పెద్దాచిన్నా తారతమ్యం లేకుండా, తన పరిమితుల గురించి ఆలోచించకుండా..... ఎవరితో పడితే వారితో విరోధం పెట్టుకుంటే ఏం జరుగుతుందో బూరుగు కథ తెలియచేస్తోంది. గర్వం ఎప్పటికీ పనికిరాదనే నీతిని పదే పదే వినిపిస్తోంది.

వాయు అవతారాలు.

• "వాయు" పరమ దేవుడైన విష్ణువును ఆరాధించడానికి విలువైన ఆత్మలను పొందడానికి ముఖ్యంగా కూడా మాధ్వాచార్యగా అవతరించారని మాధ్వ బ్రాహ్మణులు నమ్ముతారు.

• "వాయు" మొదటి అవతారం హనుమంతుడిగా పరిగణించబడుతుంది.అతని శూరకృత్యాలు, మహత్కార్యాలు రామాయణంలో స్పష్టంగా ఉన్నాయి.

• "వాయు" రెండవ అవతారం భీముడు. మహాభారతం పురాణంలో కనిపించే పాండవులలో ఒకడు.

అన్నాడు విక్రమార్కుడు.

అతనికి మౌనభగంకావడంతో శవంతోససహ మాయమైన బేతాళుడు మరలా చెట్టుపైకిచేరాడు.

పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై మరలా వెనుతిరిగాడు.

మరిన్ని కథలు

Odarpu
ఓదార్పు!
- - బోగా పురుషోత్తం
Guruvu korika
గురువు కోరిక
- టి. వి. యెల్. గాయత్రి
Itlu nee tammudu
ఇట్లు, నీ తమ్ముడు!
- అంతర్వాహిని
Naalo sagam
నాలో సగం
- టి. వి. యెల్. గాయత్రి.
Pichhuka paga-Enugu chavu
పిచ్చుక పగ - ఏనుగు చావు
- హేమావతి బొబ్బు
Ati Garabam
అతి గారాబం (బాలల కథ)
- మద్దూరి నరసింహమూర్తి
Kotta kathalu kaavaali
కొత్త కథలు కావాలి
- తాత మోహనకృష్ణ