ఒకప్పుడు మన భీమవరం, పశ్చిమగోదావరి లో పేదరికం, కష్టాల మధ్య పెరిగిన ఒక యువకుడు ఉండేవాడు. ఆయన పేరు ఎర్రప్రగడ సుబ్బారావు. చిన్నప్పటి నుంచే చదువుపై అమితమైన ఆసక్తి, తెలుసుకోవాలనే తపన ఉండేవి. అప్పట్లో మెడిసిన్ చదవడం అంటే సాధారణ విషయం కాదు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని, అతి కష్టం మీద మద్రాసులో వైద్య విద్యను పూర్తి చేశారు. వైద్యుడిగా సేవలు అందిస్తున్నా, ఆయనకు కేవలం రోగులకు చికిత్స చేయడంతో సంతృప్తి చెందలేదు. రోగాలకు అసలు కారణాలను తెలుసుకోవాలి, వాటిని సమూలంగా నయం చేసే మందులను కనుగొనాలి అనే గొప్ప లక్ష్యం ఆయన మనసులో బలంగా నాటుకుంది.
ఈ తపనతో, అప్పటికే ఉన్నతమైన పరిశోధనలకు నిలయంగా ఉన్న అమెరికాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. 1920వ దశకంలో, సుబ్బారావు గారు అమెరికా చేరుకున్నారు. మొదట్లో పేదరికం ఆయనను వెంటాడింది. ఒకవైపు చదువు, మరోవైపు జీవనం కోసం చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ, అపారమైన కష్టానికి ఓర్చుకున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో, ముఖ్యంగా పోషకాహారం, బయోకెమిస్ట్రీ రంగాలలో ఆయన పరిశోధనలు మొదలుపెట్టారు. ఆయన పరిశోధనలో మొట్టమొదటి గొప్ప విజయం, జీవక్రియకు కీలకమైన ATP (అడినోసిన్ ట్రైఫాస్ఫేట్), ఫాస్ఫోక్రియేటిన్ లలో ఉండే ఫాస్ఫేట్ను కనుగొనడం. ఈ ఆవిష్కరణ వైద్య ప్రపంచంలో అప్పట్లో ఒక సంచలనం. దీని ద్వారానే శరీరంలో శక్తి ఎలా ఉత్పత్తి అవుతుందో శాస్త్రీయంగా అర్థమైంది.
సుబ్బారావు గారు పనిచేస్తున్న లాబొరేటరీలో, చాలా మంది ప్రజలు అప్పట్లో అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా ఉన్న క్షయ (Tuberculosis - టీబీ) తో బాధపడుతూ ఉండేవారు. టీబీకి సమర్థవంతమైన మందులు లేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషాదం ఆయన హృదయాన్ని కదిలించింది. సుబ్బారావు గారు తమ పరిశోధనలన్నింటినీ టీబీని నయం చేయగలిగే ఒక కొత్త రసాయన సమ్మేళనం (Compound) కనుగొనడంపై కేంద్రీకరించారు. టీబీ బ్యాక్టీరియాను నిరోధించే శక్తి ఈ సమ్మేళనానికి ఉండాలి. అనేక రసాయనాలను పరీక్షించడం, విఫలమవడం, మళ్లీ ప్రయత్నించడం... ఇది ఒక దీర్ఘకాలిక, నిస్సత్తువ తెప్పించే ప్రక్రియ. అయినా ఆయన వెనుకడుగు వేయలేదు. ఎట్టకేలకు, ఆయన నిరంతర పరిశోధనల ఫలితంగా ఒక కొత్త రకమైన అద్భుతమైన యాంటీబయాటిక్ను కనుగొన్నారు. దీనికి మొదట ఆరియోమైసిన్ (Aureomycin) అని పేరు పెట్టారు. ఇది తరువాత, ఆధునిక వైద్యంలో అత్యంత ముఖ్యమైన యాంటీబయాటిక్లలో ఒకటైన టెట్రాసైక్లిన్ (Tetracycline) గుంపుకు చెందినది. ఆరియోమైసిన్ అద్భుతంగా పనిచేసింది. ఇది కేవలం టీబీ పైనే కాకుండా, అంతకు ముందు మందులు లేని టైఫస్, కలరా వంటి అనేక ఇతర బ్యాక్టీరియా సంబంధిత వ్యాధులను కూడా నయం చేయగల శక్తిని కలిగి ఉంది. క్షయవ్యాధికి మందు లేదన్న అపవాదును ఈ ఆవిష్కరణ తుడిచిపెట్టింది! ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల ప్రాణాలను కాపాడిన 'సంజీవని'గా ఇది నిలిచింది. సుబ్బారావు గారు కనుగొన్న ఈ మందులు ప్రపంచాన్ని మార్చాయి. కానీ విచిత్రం ఏమిటంటే, తన ఆవిష్కరణలన్నింటికీ పేటెంట్లు తీసుకోవడానికి లేదా ప్రచారం చేసుకోవడానికి ఆయన ఎప్పుడూ ఆసక్తి చూపలేదు. ఆయన పరిశోధనలు మానవాళికి ఉపయోగపడాలి అనేదే ఆయన ప్రధాన ధ్యేయం. అందుకే, ఆయన గొప్ప ఆవిష్కరణలు చేసినా, ఎక్కువ మంది భారతీయులకు ఆయన పేరు, ఆయన కృషి గురించి తెలియకుండా పోయింది. డాక్టర్ ఎర్రప్రగడ సుబ్బారావు గారు కేవలం టీబీ మందునే కాకుండా, పోలియో వ్యాక్సిన్లో ఉపయోగించే ఫోలిక్ యాసిడ్ ఆవిష్కరణలో, క్యాన్సర్కు సంబంధించిన మందుల పరిశోధనలలో కూడా కీలక పాత్ర పోషించారు. బొదకాలు, టైఫాయిడ్, పాండురోగం నిర్ములించడానికి మందులు కనుగొన్నాడు. ఆయన జీవితం, పేదరికం ఎప్పుడూ ఒక అడ్డంకి కాదు, అంకితభావం, పట్టుదల ఉంటే ప్రపంచాన్ని మార్చగల సత్తా ఉంటుంది అని నిరూపించింది.

